ఇప్పుడు గాడ్జెట్ షాపింగ్ అంతా ఈ కామర్స్ సైట్స్ నుంచే జరుగుతోంది. ఇక్కడైతే మంచి ఆఫర్లు, డిస్కౌంట్లు వంటి సౌకర్యాలు చాలా లభిస్తాయి. ఇక స్పెషల్ సేల్ పెట్టినప్పుడైతే ఆఫర్లు అదిరిపోతాయి. ఇప్పుడు అలాంటి సమయమే వచ్చింది. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్- 2020 సేల్ ప్రకటించింది.
ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభమైన ఈ సేల్ ఈ నెల 29 వరకు ఉంటుంది. అమెజాన్ ఈ సేల్ లో మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్తో పాటు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్పై ఆఫర్లిస్తోంది. ఇక ఈ ఆఫర్లలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
శాంసంగ్ ఎం30 4జీబీ/64జీబీ వేరియంట్ను రూ.11,999 కే వస్తోంది. దీని అసలు ధరరూ.16,490. ఆనర్20 రూ.22,999 కే వస్తోంది. దాని అసలు ధరరూ.35,999. ఇక వివో వీ17ప్రో రూ.27,990 కే లభిస్తోంది. దీని అసలు ధర రూ.32,990. ఇంకా.. వన్ప్లస్ 7టీ 8జీబీ/128జీబీ మొబైల్ వేరియంట్ అసలు ధర రూ.37,999 కాగా ఈ సేల్లో 34,999కే దొరుకుతోంది.
వన్ప్లస్ 7ప్రో 42,999 (రూ.52,999)కే లభిస్తోంది. ఒప్పో రీనో 10ఎక్స్ జూమ్ ఫోన్ ఎంఆర్పీ రూ.55,990 కాగా, రూ.32,990కే లభిస్తోంది. అంతే కాదు.. అదనంగా రూ.8,850 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కంట్ ఉంది. రెడ్మీ కే20, రెడ్మీ కే20ప్రో ఫోన్ల కొనుగోలుపై సాధారణం కంటే రూ.3,000 అదనపు ఎక్స్ఛేంజ్ విలువ ఇస్తారు. ఇంకా.. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, కొటాక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు యూజర్లు 10 శాతం అదనపు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు.