ఈ కామర్స్ కంపెనీలు అన్నీ కూడా జనాలను ఆకర్షించటానికి ఎన్నెన్నో కొత్త ఆఫర్లను అందిస్తున్నారు. కస్టమర్లు ఎక్కువ అయ్యేకొద్దీ ప్రాఫిట్ పెరుగుతుందనే ఆలోచన లో జనాలు ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే సేల్‌ తో కస్టమర్ల ను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా కొనుగోలు దారులకు భారీ ఆఫర్ల ను ప్రకటించింది. కరోనా ప్రభావం తగ్గిన సంగతి తెలిసిందే.. దీంతో త్వరలోనే స్కూల్స్ మరియు కాలేజీలు ప్రారంభం కానున్నాయి.


స్టూడెంట్స్ కోసం బ్యాక్ టు కాలేజ్ డేస్ పేరు తో ప్రత్యేకమైన సేల్ నిర్వహిస్తోంది. కాలేజీ స్టూడెంట్స్ కోసం ల్యాప్ టాప్స్ లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. వీటితో పాటుగా పలు రకాల వస్తువుల పై భారీ ఆఫర్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బ్యాక్ టు కాలేజ్ డేస్ సేల్ జూన్ 24 వరకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా  ల్యాప్‌టాప్స్, మానిటర్స్, హెడ్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, పవర్ బ్యాంక్స్ వంటి వాటిపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. మొన్నీమధ్య కూడా ఎలెక్ట్రానిక్ వస్తువుల పై కూడా భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తారు.


గతంలో ఉన్న ఆఫర్ల తో పోలిస్తే ఈసారి ఏకంగా 80 శాతం భారీ ఆఫర్లను అందించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు  వినియోగదారులకు మాత్రం 10 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు  ప్రకటించింది. నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. స్టూడెంట్స్‌కు రూ.750 వరకు భారీ తగ్గింపు ఉంటుంది. ఇకపోతే రూ.799 తో గ్యాడ్జెట్స్ ప్రొటెక్షన్ ప్లాన్ ను అందిస్తుంది. అంతేకాదు పెద్ద వాటి పై ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తుంది. ఇప్పటికే లాక్ డౌన్ లో ఎన్నో ఆఫర్లు కుడా అందించింది. ఈ దెబ్బ తో  ఫ్లిప్‌ కార్ట్ రేంజ్ పూర్తిగా మారి పోతుందని తెలుస్తుంది. మిగిలిన వాటికి గట్టి పోటీని ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: