కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ రైతులకు చాలా ఉపయోగకరమైన పథకం.ఇది దేశంలోనే అతి తక్కువ వడ్డీ రేటుతో కూడిన రుణ పథకం.ఈ స్కీం కింద, రైతులు తమ ఆకస్మిక ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి, స్వల్పకాలిక పదవీకాల రుణాలను పొందుతారు. ఇందులో ఒక ప్రయోజనం ఏమిటంటే, రైతులు ఈ స్కీం కింద పొందిన రుణంపై ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు.వారు చాలా తక్కువ వడ్డీకి లోన్ పొందుతారు.సాగుదారులుగా ఉన్న అన్నదాతలు, ఉమ్మడి రుణగ్రహీతలు, కౌలు రైతులు అందరూ కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. స్థానిక బ్యాంకు బ్రాంచిని సందర్శించి అప్లికేషన్ ఫారం నింపాలి. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు, వ్యవసాయ భూమికి సంబంధించిన పాస్ బుక్ ప్రతి, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుంది.కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు రూ. 50,000 వరకు, రెండవ ప్రమాదంలో రూ. 25,000 వరకు కవరేజీని పొందుతారు.


అర్హులైన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో పాటు పొదుపు ఖాతా కూడా ఇవ్వబడుతుంది, దానిపై వారు మంచి రేట్లలో వడ్డీని కూడా పొందుతారు.ఇంకా దీనితో పాటు వారు స్మార్ట్ కార్డ్ ఇంకా డెబిట్ కార్డ్ కూడా పొందుతారు.లోన్ తిరిగి చెల్లించడంలో చాలా వెసులుబాటు ఉంది. బ్యాంకుల నుంచి అప్పు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు.ఈ క్రెడిట్ వారి వద్ద 3 ఏళ్ళు ఉంటుంది. రైతులు పంట పండించిన తర్వాత వారి లోన్ ని తిరిగి చెల్లించవచ్చు.మీరు భూమిని కలిగి ఉండి వ్యవసాయం కనుక చేస్తుంటే, అప్లై చేసుకోవచ్చు.ఈ స్కీం కింద లోన్ తీసుకోవడానికి రైతులందరూ కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. భాగస్వామ్యం వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు ఉండాలి.దీన్ని ఆన్లైన్ ద్వారా కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: