ఆ కాలనీ వాసులు అందరూ నిఘా పెట్టారు.. ఇక అనుకున్న ప్లాన్ ప్రకారమే పట్టుకున్నారు.. ఇక అందరూ కలిసి ఇద్దరిని స్తంభానికి కట్టేసారు. ఆ తర్వాత ఇక అందరూ కలిసి దారుణంగా చితకబాదారు. చివరికి గుండు కట్టించారు. ఇక చివరికి పోలీసులు ఎంట్రీ  ఇవ్వడంతో సీన్ రివర్స్ అయ్యింది .. అసలు ఇంతకీ అతను ఏం చేశాడు.. అలా అందరూ కలిసి ఆ ఇద్దరినీ  కట్టేసి కొట్టడానికి గల కారణాలు ఏంటి అనుకుంటున్నారు కదా.. అతను చేసింది దొంగతనం  బ్యాటరీలను దొంగతనం చేస్తున్నారు అనే ఆరోపణలతో ఇద్దరు యువకులను కరెంటు స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టి గుండు కొట్టించారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.


 అయితే యువకులు తమకు జరిగిన అవమానంతో చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇక బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే శంషాబాద్లోని అహ్మద్ నగర్ కు చెందిన మహమ్మద్ ఖుద్ధుస్, ఎండి ఖాజా లు స్క్రాప్ బిజినెస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. అయితే వీళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇకపోతే గత కొంత కాలం నుంచి అహ్మద్ నగర్ లో వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు చోరీ అవుతున్నాయి.


 ఈ క్రమంలోనే ఇక ఈ దొంగతనాలకు పాల్పడుతుంది స్క్రాప్ బిజినెస్ చేస్తున్నాను ఎండి  కాజా, మొహమ్మద్ ఖుద్ధుస్ అని స్థానికులు భావించారు. ఇద్దరూ కలిసి వాహనాల బ్యాటరీలు దొంగలించారు అనే కారణంతో అహ్మద్ నగర్ కాలనీ వాసులు అందరూ ఇద్దరు యువకులను బలవంతంగా స్థానికంగా ఉన్న మసీదు వద్ద స్తంభానికి కట్టేసి కొట్టారు. ఇక ఇద్దరు యువకుల ఇంట్లో దొరికిన బ్యాటరీలను వీరు మెడలో వేసి ఇక వీరికి అందరి ముందే గుండు కొట్టించి దారుణంగా అవమానించారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులను అవమానించిగుండు కొట్టించిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: