మనిషి జీవితం దేవుడి చేతి లో కీలు బొమ్మ లాంటిది అని అంటూ ఉంటారు. అయితే వెలుగు లోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇది నిజమే అన్న భావన ప్రతి ఒక్కరి లో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంతా సాఫీగా సాగి పోతుంది అనుకుంటున్న సమయం లో ఊహించని ఘటనలు మృత్యువు ఒడిలోకి చేరుస్తూ ఉంటాయి. దీంతో సంతోషం గా ఉన్న కుటుంబం మొత్తం ఇక శోకం లో మునిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి.



 ఇలా సంతోషంగా సాగిపోతున్న కుటుంబాల్లో ఆనందాన్ని విధి చిన్నచూపు చూసి చివరికి వారి కుటుంబం లో విషాదాన్ని నింపుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత నిజం గానే మనిషి జీవితం దేవుడు చేతి లో కీలుబొమ్మ లాంటివే అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మహిళకు ఇలాంటిదే జరిగింది . ఏకంగా మహిళ విషయంలో విధి చిన్నచూపు చూసింది. దీంతో ఏకంగా ప్రమాదం రూపంలో మృత్యువు దూసుకు వచ్చి చివరికి ఆమె ప్రాణాలు తీసేసింది.


 ఈ ఘటన పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. జంగం మల్లమ్మ అనే 60 ఏళ్ల మహిళ బట్టలు ఉతికేందుకు వెళ్ళింది. ప్రమాదవశాత్తు చెరువులో పడింది. అయితే ఈత రాకపోవడంతో చివరికి మృతి చెందింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఓ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమెను కాపాడలేకపోయారు. అయితే మరుసటి రోజు ఉదయం గ్రామంలోని దుబ్బచెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లిన కొంతమంది మహిళలు ఈ విషయాన్ని గమనించి స్థానికులకు చెప్పారు. ఇక స్థానికులకు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు చివరికి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: