సాధారణంగా ప్రేమ అంటే ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం అని ఒకప్పుడు చెప్పేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ప్రేమ అనేది నయవంచనకు చిరునామాగా మారిపోయింది అన్నది ఎవరో చెప్పడం కాదు వెలుగులోకి వస్తున్న ఘటనలే చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ఎంతో మంది యువకులు ప్రేమ అనే ముసుగు వేసుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి అనే మాట వచ్చేసరికి ముఖం చాటేస్తూ ఇక అమ్మాయిలను మోసం చేస్తున్న ఘటనలు వేలుగులోకి వస్తున్నాయి.  అయితే కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు అటు అమ్మాయిలు కూడా ఇలా ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో చాలానే జరుగుతూ ఉన్నాయి.



 వెరసి ప్రేమించిన వారి చేతిలో మోసపోయిన వారు చివరికి బాధతో ఆత్మహత్య చేసుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. ఇటీవల విల్లుపురం జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో విద్యార్థునీని మోసం చేసి గర్భిణీ చేసిన నీచుడు అంతటితో ఆగకుండా దారుణంగా ఆమెను హత్య చేశాడు. ఇక మృతదేహాన్ని పాతిపెట్టి తప్పించుకోవాలి అనుకున్నాడు. కానీ చివరికి పోలీసులు విచారణ చేపట్టడంతో ప్రియుడి అసలు బండారం బయటపడింది. జిల్లాలోని సంజీ సమీపంలో గ్రామస్తులు 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమయ్యారు.


 ఇక ఈ ప్రాంతానికి సమీపంలో స్మశాన వాటిక కూడా ఉంది. దానికి సమీపంలో మట్టి పనులు చేస్తుండగా మృతదేహం బయటపడింది. దీంతో భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడ దొరికిన మృతదేహం కంట మానడకి చెందిన ప్లస్వన్ విద్యార్థిని ప్రియదర్శినిదిగా గుర్తించారు. ప్రేమ పేరుతో ప్రియుడే గర్భిణీనీ హత్య చేసినట్లు విచారణలో తేలింది. దీంతో చిత్తేరిపట్టు గ్రామానికి చెందిన అఖిలన్ ను గుర్తించి అరెస్టు చేసి విచారిస్తూ ఉండడం గమనార్హం. ఈ ఘటన స్థానికంగా సంచలనగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: