భార్య భర్తను సరిగ్గా చూసుకోవడం, భర్తకు కావలసిన అన్నీ వండి పెట్టడం అది ఒక్కప్పటి మాట.. కానీ ఇప్పుడు భర్త వేరే ఆవిడా మోజులో పడితే తన దగ్గర లేనిది వేరే ఆడదాని దగ్గర ఏముంది అని దారుణాలకు పాల్పడుతున్నారు..భర్తకు దూరంగా ఉన్న మొదటి భార్య.. రెండో భార్య మోజులో ఉన్న భర్త ఎవరికీ దక్కకుండా చేయాలనే ఆలోచనతో కిల్లర్ ముఠాతో కిడ్నాప్ చేయించింది..

 

 


ఈ సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరు లోని మరతహల్లి ప్రాంతానికి చెందిన షాహిద్ షేక్ (32), రోమా భార్యా భర్తలు. ఏడాది కిందట రత్న ఖాతుమ్ అనే మరో యువతి ని షాహిద్ రెండో వివాహం చేసుకున్నాడు. విశ్వేశ్వరయ్య లేఔట్‌ లో రెండో భార్య తో కొత్త కాపురం పెట్టాడు. అప్పటి నుండి అతను ఇంటికి రావడమే మానేశారు.. దాంతో ద్వేషాన్ని పెంచుకున్న భార్య భర్తను, అతని రెండో భార్యను కిడ్నాప్ చేయించింది.

 

 

 

అప్పటి నుంచి మొదటి భార్య వద్దకు రావడం మానేశాడు. ఆమె బంగారు నగలు కూడా తీసుకెళ్లి రెండో భార్య రత్న కి ఇచ్చేశాడు. భర్త రెండో భార్య తోనే ఉండడం.. ఇంటి వైపు రాకపోవడంతో ఆగ్రహం చెందిన మొదటి భార్య రోమా మొగుడి కిడ్నాప్ ‌కి ప్లాన్ చేసింది. నలుగురు యువకుల తో రెండు లక్షలకు బేరం కుదుర్చుకుని భర్తని కిడ్నాప్ చేయించింది. అనంతరం రెండో భార్యే కిడ్నాప్ చేయించిందంటూ హైడ్రామా కు తెర తీసింది. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాపర్లు షాహిద్‌ని హస్సన్ జిల్లాలో ఉంచినట్లు గుర్తించి విడిపించారు. నిందితులు అభిషేక్(26), భరత్ (25), ప్రకాష్ (22), చలువ మూర్తి (22)ని అదుపులోకి తీసుకున్నారు. మొదటి భార్యను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: