నేటి సమాంజో ప్రతీదీ కల్తీగానే మారిపోయింది. తినే ప్రతి వస్తువు కల్తీమయమే.. తాగే వాటిని కూడా కొందరు కంత్రీ గాళ్లు కల్తీ చేసేస్తున్నారు. ఈ కల్తీ వాటిని తీసుకున్న జనాలు ప్రాణాలతో ఉంటారా.. ఎంతో మంది ఈ కల్తీ మహమ్మారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా
బీహార్ లో ఐదుగురి ప్రాణాలను కల్తీ
సారా తీసేసింది. ముజఫర్ పూర్ జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో ఏకంగా ఒకరు తర్వాత ఒకరుగా మొత్తంగా ఐదుమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ మరణాలకు కారణం కేవలం స్థానికంగా కొందరు వ్యక్తులు అమ్ముతున్న కల్తీ సారానే కారణమని కొందరు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే
బీహార్ లో ఇప్పటికే మద్యం నిషేధం విధించారు అధికారులు. అయినా అక్రమంగా ఇంకా కొందరు కేటుగాళ్లు కల్తీ మద్యాన్ని అమ్ముతూ.. ఎంతో మంది ప్రాణాలను పొట్టొన బెట్టుకుంటున్నారు. కేవలం కల్తీ మద్యం మూలంగానే ఈ ఐదుగురు ప్రాణాలు విడివడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన జిల్లాలోని కట్రా
పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దర్గా గ్రామంలో జరిగింది. కాగా ఈ కల్తీ సార దందా వెనక ఓ చోటా నాయకుడి హస్తం ఉందని కొందరు
బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం వారు తయారు చేసిన నాటు
సారా మూలంగానే అమాయకులైన ఐదుగురి మృతికి కారణమయ్యారని వారు విమర్శిస్తున్నారు.
ఇక పోతే ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుల పోస్టుమార్టం రిపోర్టులో వీరి మరణానికి కారణం సారానా.. లేక మరోటా.. అనేది తేలుతుందని పోలీసులు అంటున్నారు. ఈ ఒక్క చోటే కాదు.. దేశంలోని ఏదో ఒక ప్లేస్ లో ఇలాంటి కల్తీ జరుగుతూనే ఉంది. దీని భారిన పడి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఈ దారుణాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ మధ్యనే కల్తీ కల్లు, మద్యం మూలంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చి.. అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది.