మెగాస్టార్ చిరంజీవి మరియు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా “మన శంకర వర ప్రసాద్ గారు”. సంక్రాంతి బరిలో నిలవబోతున్న ఈ సినిమా, కేవలం ప్రోమోలతోనే కాకుండా తన సంగీతంతోనూ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ చిత్రంలోని మొదటి పాట ‘మీసాల పిల్ల’  తాజాగా 100 మిలియన్ వ్యూస్ మార్కును దాటి, 2025లోనే అతిపెద్ద తెలుగు చార్ట్‌బస్టర్‌గా అవతరించింది. ‘మీసాల పిల్ల’ - 100 మిలియన్ల ప్రభంజనం తో దూసుకు పోతోంది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన ఈ ట్యూన్, క్లాసిక్ మెలోడీకి ఆధునిక స్పర్శను ఇచ్చింది.


ఒక‌ప్ప‌టి మధుర గాయకుడు ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్‌లతో కలిసి పాడిన ఈ పాట శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. చిరంజీవి తనదైన శైలిలో చేసిన గ్రేస్ ఫుల్ డాన్స్ స్టెప్పులు, నయనతారతో ఆయనకున్న కెమిస్ట్రీ ఈ పాటను విజువల్ ఫీస్ట్‌గా మార్చాయి. చిరులోని పాత కాలపు ఛార్మ్ మరియు ఇప్పటి ఎనర్జీ కలగలిసి ఈ రికార్డును సుసాధ్యం చేశాయి. కేవలం ‘మీసాల పిల్ల’ మాత్రమే కాకుండా, ఈ సినిమా లోని మిగిలిన పాటలు కూడా యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి:


రెండో సింగిల్‌గా విడుదలైన ఈ పాట ఇప్పటికే 35 మిలియన్ వ్యూస్ దాటి శ్రోతలను అలరిస్తోంది. నిన్న విడుదలైన ఈ హై-వోల్టేజ్ సాంగ్‌లో చిరంజీవి మరియు వెంకటేష్ కలిసి స్టెప్పులేయడం అభిమానులకు అసలైన పూనకాలు తెప్పించింది. విడుదలైన 24 గంటల్లోనే 8 మిలియన్ల వ్యూస్ సాధించి, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి వేడుకలకు మెయిన్ అట్రాక్షన్‌గా మారింది.


బ్యాక్-టు-బ్యాక్ హిట్ సాంగ్స్‌తో మేకర్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చారు. ఒక పక్క క్లాస్ మెలోడీలు, మరోపక్క మాస్ సాంగ్స్ ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోనుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి తోడు, ఈ మ్యూజికల్ హిట్ తోడవ్వడంతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి విన్నర్‌గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సంగీతం సినిమా సక్సెస్‌లో సగం పాత్ర పోషిస్తుందని అంటారు. ‘మీసాల పిల్ల’ క్రియేట్ చేసిన 100 మిలియన్ల రికార్డు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించబోయే సునామీకి ఒక చిన్న శాంపిల్ మాత్రమేనని మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: