దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. లక్షల్లో కేసులో నమోదు అవుతున్నాయి. ఇక వేలల్లో జనాలు మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.. మరి కొందరు మాత్రం జల్సాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు వెలుగు చూసిన ఓ ఘటన నిజంగా దారుణమని చెప్పాలి.. తన షాప్ లో పనిచేస్తున్న ఓ యువతికి కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టాడు.. 


వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా లో వెలుగు చూసింది..బ్రతుకు దెరువు కోసం పనిలో చేరిన అమ్మాయి పై దుర్మార్గుడు అయిన షాప్ యజమాని కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అతి దారుణంగా రేప్ చేశాడు..గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. కరోనా కారణంగా కళాశాల మూతపడడంతో ఏదైనా పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలని పట్టణంలోని ఓ షాప్ స్వీట్, స్నాక్స్ షాప్ లో నెలకు రూ.5 వేల జీతంపై పనిలో చేరింది. 


ఈ షాప్ సోమవారం ఎవరూ లేని సమయంలో ఆమెకు కూల్ డ్రీక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆ పానీయాన్ని తాగిన కొద్దిసేపటికే ఆమె మత్తులోకి జారుకోవడంతో లైంగికదాడికి పాల్పడ్డాడు.అనంతరం తనపై లైంగికదడి విషయం అవగతమైన యువతి తల్లిదండ్రులకు చెప్పింది. అందిన ఫిర్యాదు మేరకు పొన్నూరు అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. షాప్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కులాల మధ్య చిచ్చు పెట్టింది. దళిత యువతి కావడంతో వారంతా నిరసన చేస్తున్నారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: