ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటై ఏడడుగులు నడిచిన తర్వాత కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడునీడగా  ఉండాలి భార్య భర్తలు. అంతేకాదు ఒకరినొకరు మోసం చేసుకోకుండా ఎంతో అన్యోన్యంగా మెలుగుతూ ఉండాలి. కానీ ఇటీవలి కాలంలో భార్యాభర్తల్లో మాత్రం ఎక్కడా ఇలాంటి అన్యోన్యత  కనిపించడం లేదు. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకోవడానికి కాస్తయినా  ఆలోచించడం లేదు. పెళ్లి సమయంలో జీవితాంతం తోడు ఉంటానని ప్రమాణం చేసిన వారే చివరికి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి కోటి ఆశలతో అడుగుపెట్టింది ఆ నవవధువు. ఇక అత్తమామలను తల్లితండ్రులుగా భావించి మెట్టినింట్లో కి  వచ్చింది. ఇక భర్త  కష్ట సుఖాల్లో తోడు ఉంటాడు అని అనుకుంది. భర్తే సర్వస్వం అంటూ బ్రతకడం  మొదలు పెట్టింది ఆ యువతి. కానీ ఆ యువతి ఆశలపై నీళ్లు చల్లాడు భర్త. పెళ్లి అయిన ఆరు నెలలకే ఏకంగా ప్రియురాలి తో  పారిపోయి కూడా  భార్యకు షాకిచ్చాడు. కోటి ఆశలతో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన ఆ యువతి భర్త చేసిన పనికి దిక్కుతోచని స్థితిలో కి వెళ్ళిపోయింది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో వెలుగులోకి వచ్చింది  ఈ ఘటన.


 మల్కాపురం గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడికి పక్క గ్రామానికి చెందిన యువతికి  గత ఏడాది జూన్ 4వ తేదీన పెళ్లి జరిగింది. కొన్నాళ్ళ వరకు భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా నే ఉన్నారు. కానీ ఇటీవల ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు మహేష్.. అయితే భీమనపల్లి గ్రామానికి చెందిన యువతితో బైక్పై వెళ్తుండగా కనిపించినట్లు స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అదే ఇలా ఇద్దరూ ఇంట్లో తెలియకుండా కూడా పారిపోతున్న  సమయంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఇక కుటుంబ సభ్యులు మహేష్ నూ ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఇటీవలే  హెల్త్ చెకప్ కోసం అని చెప్పి మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయాడు మహేష్ . ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలంటూ ఆ నవవధువు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: