ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. ఇక ప్రపంచం మొత్తం సోషల్ మీడియా అనే మాయలో మునిగి తేలుతోంది. బయట ప్రపంచంతో సంబంధాలను తెంచుకొని.. మరి సోషల్ మీడియాలో కొత్త బంధాలను కలుపుకోవడానికి అందరూ తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ఇక ఇంటర్నెట్ లోనే బ్రతికేస్తూ ఉన్నారు జనాలు. ఇలా సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితాలలో ఎన్నో మార్పులకు కారణమైంది అని చెప్పాలి.


 అయితే సోషల్ మీడియా మాయలో మునిగిపోతున్న జనాలు పక్కన ఉన్న మనుషులను పట్టుకోవడం మానేసి చాలా రోజులు అవుతుంది. ఎక్కడో ఉన్న మనుషులతో ఇంటర్నెట్లో చాటింగ్ చేస్తున్నరు తప్ప.. పక్కన వారితో మాట్లాడటం లేదు. అయితే నేటి రోజుల్లో ప్రేమలు పెళ్లిళ్లు కూడా అటు సోషల్ మీడియాలోనే జరిగిపోతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్లో పుడుతున్న ప్రేమలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇంస్టాగ్రామ్ ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 మధ్యప్రదేశ్ లోని సుస్నేర్ లో బాలురామ్ అనే 80 ఏళ్లవృద్ధుడు మహారాష్ట్రకు చెందిన షీలా అనే 34 ఏళ్ళ  మహిళను వివాహ మాడాడు. అయితే బాలురామ్ ఫన్నీ రీల్స్ చేస్తే వాటిని స్నేహితుడు విష్ణు గుజ్జర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసేవాడు. అయితే ఇవి చూసిన షీలా ఇక బాలురాం తో పరిచయం పెంచుకుంది. పరిచయం ప్రేమగా మారగా ఈనెల 1వ తేదీన పెళ్లి చేసుకుంది ఈ జంట. అయితే భార్యను కోల్పోయి ఆర్థిక నష్టాలతో డిప్రెషన్లో ఉన్న బాలురామ్ తో ఇక ఇలాంటి ఫన్నీ వీల్స్ చేయించేవాడట అతని స్నేహితుడు విష్ణుగుజార్. చివరికి ఇలాంటి రీల్స్ అతనికి ఒక భాగస్వామిని తెచ్చిపెట్టింది. ఈ విషయం గురించి తెలిసి 80 వెడ్స్ 34 ఇదొక ఇంస్టాగ్రామ్ ప్రేమ కథ అంటూ ఇంటర్నెట్ జనాలు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: