న్యూఢిల్లీలోని ఇండియన్‌ సొసైటీ ఫర్‌ ట్రెయినింగ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌(ఐఎస్‌టీడీ) - పీజీ డిప్లొమా ఇన్‌ ట్రెయినింగ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది 18 నెలల వ్యవధి గల హైబ్రిడ్‌ ఇంటరాక్టివ్‌ ప్రోగ్రామ్‌. ఇందులో హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన అం శాలు బోధిస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 12 సబ్జెక్ట్‌లు, మూడు నెలల వ్యవధి గల ఇంటర్న్‌షిప్‌ ప్రాజెక్ట్‌ ఉంటాయి. వీటిలో పది సబ్జెక్ట్‌లు పూర్తిచేసినవారికి డిప్లొమా ప్రదానం చేస్తారు. డిప్లొమాకు మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌(ఎంహెచ్‌ఆర్‌డీ) గుర్తింపు, పీజీ డిప్లొమాకు మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కల్చర్‌ గుర్తింపు ఉన్నాయి. బ్యాంకులు, బిజినెస్‌ సంబంధిత సంస్థలు, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాలు, అగ్రికల్చర్‌- హెల్త్‌-ఎడ్యుకేషన్‌ విభాగాలు, డిఫెన్స్‌ ఫోర్సెస్‌, సోషల్‌ సెక్టార్‌-వాలంటరీ సంస్థలు, కన్సల్టెన్సీలలో పనిచేస్తున్న హెచ్‌ఆర్‌డీ ఆఫీసర్స్‌, ట్రెయినింగ్‌ ప్రొఫెషనల్స్‌, లైన్‌ మేనేజర్స్‌, ప్రొఫెషనల్స్‌కు ఈ కోర్సు ప్రయోజనకరంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకొన్ననాటి నుంచి నాలుగేళ్లలోపు ప్రోగ్రామ్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది.ఏటా రెండుసార్లు అడ్మిషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు.


 ప్రోగ్రామ్‌ పూర్తిచేసినవారికి ఏడాదిపాటు సంస్థలో ఉచితంగా మెంబర్‌షిప్‌ ఇస్తారు. ఇందులో మూడు సెమిస్టర్‌లు ఉంటాయి. ప్రతి సెమిస్టర్‌లో నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్‌లో బిజినెస్‌ స్ట్రాటజీ అండ్‌ హెచ్‌ఆర్‌డీ, ఇన్‌స్ట్రక్షనల్‌ డిజైన్‌, ట్రెయినింగ్‌ మెథడ్స్‌ - కాగ్నిటివ్‌, ట్రెయినింగ్‌ మెథడ్స్‌ - ఎక్స్‌పీరియెన్షల్‌; రెండో సెమిస్టర్‌లో ఫెసిలిటేషన్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ ప్రజంటేషన్‌ స్కిల్స్‌, ట్రెయినింగ్‌ మెజర్‌మెంట్‌ అండ్‌ ఎవల్యూషన్‌, మేనేజింగ్‌ ద ట్రెయినింగ్‌ ప్రాసెస్‌; మూడో సెమిస్టర్‌లో డేటా అనలిటిక్స్‌ ఇన్‌ ట్రెయినింగ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌, ఇన్నొవేషన్‌ అండ్‌ ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఇన్‌ టీ అండ్‌ డీ, ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌(టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌, డెవల్‌పమెంట్‌ సెంటర్‌ మేనేజ్‌మెంట్‌, రీసెర్చ్‌ మెథడాలజీ) పేపర్లు ఉంటాయి.


సంబంధిత రీడింగ్‌ మెటీరియల్‌, ఈ-జర్నల్‌ అందిస్తారు. ఆన్‌లైన్‌ కాంటాక్ట్‌ క్లాసెస్‌ ఉంటాయి. ఫార్మాటివ్‌, సమ్మేటివ్‌ అసైన్‌మెంట్‌లు పూర్తిచేయాల్సి ఉంటుంది.ప్రోగ్రామ్‌ చివరలో ప్రొక్టోర్డ్‌ ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు.గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. బీఈ/బీటెక్‌, ఎంబీబీఎస్‌, సీఏఐబీ, ఏసీఏ, ఐసీడబ్ల్యుఏఐ, ఎంఈడీ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చేసినవారు; పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. సాయుధ దళాల ఉద్యోగులు, మాజీ సైనిక అధికారులు, పారా మిలిటరీ దళాల అభ్యర్థులు కూడా అర్హులే. అనుభవం ఉండాల్సిన అవసరం లేదు.పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ www.istd.in ని సందర్శించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: