రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బహిరంగ సభల ద్వారా, మీడియా ద్వారా నిరంతరం వైసీపీనుదే ఫోకస్ చేస్తున్నారు. ఈ స్థాయి ఎదురుదాడి జరుగుతుంటే, సహజంగానే వైసీపీ కూడా సమాన స్థాయిలో కౌంటర్ ఇచ్చి తన బలాన్ని చూపాలి. కానీ అలాంటి ధైర్యవంతమైన రిప్లై ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీలో గతంలోనూ గొంతెత్తి మాట్లాడేవారిని ప్రోత్సహించలేదు. విమర్శలు ఎదుర్కోగలిగే నాయకుల్ని పక్కన పెట్టడం, నిర్ణయ ప్రక్రియలో ఒంటరితనం చూపించడం వల్ల, ఇప్పుడు ప్రతిపక్ష దాడులకు సమాధానం చెప్పేవారి కొరత ఏర్పడింది. ఈ లోటును గుర్తించిన కూటమి ప్రజల మూడ్ను పూర్తిగా తన వైపుకు తిప్పుకునేలా వైసీపీపై వ్యతిరేకతను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకు వెళుతోంది.
మరో కీలక అంశం ఏంటంటే జగన్ స్ట్రాటజీ. ప్రస్తుతం ఆయన బెంగళూరు - తాడేపల్లి రూట్లోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీంతో జిల్లాల నేతలు కూడా “ సాధారణ నాయకులం కదా… ప్రజల దగ్గరకు ఎందుకు వెళ్లాలి ? ” అనే అలసత్వంలోకి జారుతున్నారని పార్టీ అంతర్గతంగా వినిపిస్తోంది. ఇది చివరికి పార్టీ - ప్రజల మద్య దూరాన్ని రోజురోజుకూ పెంచుతోంది. ఇలా కొనసాగితే వైసీపీ పతనానికి ప్రత్యర్థులు కాకుండా వైసీపీయే బాధ్యత తీసుకున్నట్లవుతుందన్న చర్చలు నడుస్తున్నాయి. జగన్ వెంటనే ఈ మిస్టేక్ సరిచేస్తూ పార్టీని ముందుకు నడిపించకపోతే వైసీపీ శరవేగంగా పతనమవుతుందనడంలో సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి