ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఏ రేంజ్లో వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చైనాలో పుట్టిన కరోనావైరస్ ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలను ముప్పతిప్పలు పెడుతోంది. కంటికి కనిపించని ఈ శత్రువు మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. మరోవైపు కరోనా లాక్డౌన్ ఉద్యోగులపై బాగా ఎఫెక్ట్ చూపింది. లాక్డౌన్తో బిజినెస్లు, ఫ్యాక్టరీలు మూత పడటంతో.. కంపెనీల రెవెన్యూలు బాగా తగ్గిపోయాయి. దీంతో కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేయడం ప్రారంభించాయి. అయితే ఇలాంటి సమయంలో నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెబుతూ.. కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్ భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది.
ఈ నోటిఫికేషన్లో 2167 పోస్టుల్ని భర్తీ చేసేందుకు సెంట్రల్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్. బిజినెస్ రిప్రజెంటేటీవ్, అసిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ లాంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీలు 2167 ఉండగా.. అందులో బిజినెస్ రిప్రజెంటేటీవ్- 1036, అసిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్- 996, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్- 36, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్- 99 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విషయానికి వస్తే.. వేర్వేరు పోస్టులకు 10వ తరగతి, బీకామ్, బీబీఏ, ఎంకామ్ లాంటి అర్హతలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.cagdi.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక వేతనాల వివరాలు పరిశీలిస్తే.. బిజినెస్ రిప్రజెంటేటీవ్- రూ.16,680, అసిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్- రూ.20,500, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్- రూ.45,000 మరియు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్- రూ.38,000 నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 2020 మే 24 నాటికి 28 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఇక ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుని ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.