ఏపిలో విద్యాలయాలు తెరుచుకున్నాయి..నవంబర్ 2 నుంచి స్కూల్ మరియు కాలేజీలు ప్రారంభం అయ్యాయి..అయితే ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఉన్న టీచర్ బదిలీల పై సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రోజుల్లో ఆ బదిలీలు జరగనున్నాయి.. ఇక ఉపాధ్యాయ బదిలీలకు రివైజ్డ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. బదిలీ నిబంధనల్లో పలు మార్పులు చేసిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కొత్త షెడ్యూల్‌ జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బి. రాజశేఖర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం.. నవంబరు 28, 29ల మధ్య దరఖాస్తులను పరిశీలిస్తారు. నవంబరు 30-డిసెంబరు 2 మధ్య పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్‌ సీనియారిటీ నుంచి లిస్ట్ ను పరిశీలించనున్నారు..



డిసెంబర్ నెలలో టీచర్ బదిలీల ప్రక్రియ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..3, 4 తేదీల్లో టీచర్ల అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. 5,7 మధ్య జాయింట్‌ కలెక్టర్‌ అభ్యంతరాలను పరిశీలిస్తారు. డిసెంబరు 8,10 తేదీల్లో పాయింట్ల ఆధారంగా తుది సీనియారిటీ లిస్టును విడుదల చేస్తారు. ఇక, 11,15 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అనుమతించనున్నారు. 16 నుంచి 21 తేదీల్లో బదిలీ ఆర్డర్లను జారీ చేస్తారు. వీటిలో సాంకేతిక సమస్యలు ఉంటే డిసెంబరు 22,23 తేదీల్లో అభ్యంతరాలను తెలియజేయవచ్చు అని సంభందిత అధికారులు తెలిపారు..డిసెంబరు 24న బదిలీ ఆర్డర్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తారు.




విశ్వ విద్యాలయాలను కొత్త వైస్ ఛాన్సలర్ ను నియమించడానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైలుపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపి, పలు అభ్యంతరాలపై వివరణలు తీసుకుని తన ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలకు కొత్త వైస్‌చాన్సలర్లను నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్ చంద్ర నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. యునివర్సిటీ ల నుంచి కొత్త వీసి లను నియమించారు. ఏ యునివర్సిటీ కి ఎవరిని నియమించారు అనేది ఇప్పుడు చూద్దాం...



ఆంధ్రా విశ్వవిద్యాలయం కు సీనియర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి వీసీగా నియమితులయ్యారు.

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కు రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె.రాజారెడ్డి వీసీగా నియమితులయ్యారు.

రాయలసీమ విశ్వవిద్యాలయం కు ప్రొఫెసర్‌ ఎ.ఆనందరావు వీసీగా నియమితులయ్యారు.

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కు రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె.రామకృష్ణారెడ్డి వీసీగా నియమితులయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: