దేశంలో బంగారం ధరలు అదుపులోనే ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో భారీ స్థాయిలో ధరలు ఉండగా, ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దాదాపుగా 11 వేలకు పైగా బంగారం తగ్గింది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారం వెలవెలబోతోంది. నిన్న పెరిగిన ధర ఈరోజు మాత్రం పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడుస్తోంది. వెండి కూడా భారీగా తగ్గింది.


ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ. 43,750కి చేరింది. 10 గ్రాముల 24 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.47,730కి చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర రూ.1300 తగ్గి రూ.74,400 కి చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు... వెండి వస్తువుల వినియోగం కూడా పూర్తిగా తగ్గిపోయింది. దీంతో వెండికి రేట్లు పడిపోయాయని నిపుణులు అంటున్నారు.



అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధర లను పరిశీలిస్తే..బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 1800 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. ఔన్స్‌కు 0.63 శాతం పెరుగుదలతో 28.03 డాలర్లకు ఎగసింది...ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం వల్ల ధరలలో మార్పులు కలుగుతున్నాయని తెలుస్తుంది. రేపటి రోజున బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: