ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. భారతదేశం చాలా గొప్ప దేశం అని చెప్పడానికి యోగ అనేది నిదర్శనం. యావత్ ప్రపంచానికే యోగాని పరిచయం చేసింది మన దేశం. యోగ లో ఎన్నో ఆసనాలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ వాటిల్లో ప్రాణాయామం చాలా ముఖ్యమైనది. ప్రాణాయామం అనేది మన శరీరంలోని ప్రతి కణానికి శక్తినిచ్చే ఒక ఆసనం. ప్రాణాయామం ఒక సంస్కృత పదం, సంస్కృతంలో ఈ పదానికి ‘జీవన శక్తి యొక్క పాండిత్యం’, జీవిత శక్తిని, మన శరీరాన్ని నిలబెట్టే శ్వాసను బయటకు తీయడం అని అర్థం వస్తుంది.


రోజూ క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు...

ప్రాణాయామంతో మన శరీరంలోని 80 వేల నరాలు శుద్ధి అవుతాయి. ఇలా శుద్ధి అవ్వడం వల్ల మన శరీరంలోని ఎనర్జీ ఫ్లో బాలన్స్ అవుతుంది. దీనితో శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణాయామం రోజు చేయాలని చాలా మంది డాక్టర్స్ చెప్పుతున్నారు. ఇది రోజు చేయడం వల్ల స్ట్రెస్ ను పోగొట్టి ప్రశాంతతను అలాగే ఆరోగ్యాన్ని ఇస్తుందని డాక్టర్స్ చెబుతున్నారు.
చాలామంది మెడిటేషన్ చేస్తూ యోగ చేయకుండా తోసిపుచ్చుతారు. అయితే ప్రాణాయామం మీకు శారీరక దృఢత్వాన్ని సాధించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది కాబట్టి ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మీ శరీర కాంతి పెంచుతుంది. సహజంగా మీ శరీరానికి గ్లో రావాలంటే రోజు ప్రాణాయామం చెయ్యాలి. ఇది ఒక వ్యక్తి లోని శక్తిని పెంచుతుంది.

ప్రస్తుత రోజుల్లో అందరు బిజీ లైఫ్ గడుపుతున్నారు. దీని వల్ల అందరిలో ఒత్తిడి పెరిగి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.ప్రాణాయామం చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ క్రమ శిక్షణతో చేయాలి. యోగ శాస్త్రం ప్రకారం జీవిత శక్తికి దారి చూపే అన్నిటిలో పాల్గొనడమే ప్రాణాయామం యొక్క లక్ష్యం. సరిగా శ్వాస తీసుకోవడమే ప్రాణాయామం. ఇందులో మీరు శ్వాస సరిగ్గా తీసుకుంటారు కాబట్టి, ఈ ప్రాణాయామం లో శరీరా భాగాలన్నీ ఉన్నట్టే. దీని వల్ల తాజా ఆక్సిజన్ మీ శరీరంలోని ప్రతి అవయవానికి చేరుకుంటుంది.ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: