మధుమేహం కారణంగా కూడా పాదాల్లో మంట మొదలవుతుంది. థైరాయిడ్‌ హార్మోన్‌ తగినంత ఉత్పత్తి కాకపోవటం (హైపోథైరాయిడిజమ్‌) ఇంకా దీర్ఘకాల కిడ్నీ జబ్బులు, రోగనిరోధకశక్తి తగ్గిపోవడం ఇంకా రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ వంటి వాటి కారణంగా కూడా ఈ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. కొంతమందికి మానసిక ఒత్తిడి ఇంకా అలాగే ఆందోళన సమస్యలతోనూ అరికాళ్లలో మంటలు రావొచ్చు. ఇక ఆడవారిలో అయితే నెలసరి నిలిచిపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. ఇలాంటి వారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు కొన్ని చిట్కాలను కూడా ఖచ్చితంగా పాటించాలి.



పసుపులో మంచి ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పాదాల మంట ఇంకా అలాగే దురద నుంచి ఉపశమనం పొందడంలో బాగా సహాయపడుతుంది.ఇక ఇందుకోసం పసుపులో కొంచెం కొబ్బరినూనె కలిపి మీ పాదాలకు రాసుకోవాలి. దీంతో మీ పాదాలకు మంచి విశ్రాంతి లభిస్తుంది. పసుపు యాంటీబయాటిక్ ఇంకా అలాగే యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పాదాల ఇన్ఫెక్షన్ ఇంకా చికాకును తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.అరికాళ్లలో మంటలు ఇంకా అలాగే దురద సమస్యలను వదిలించుకోవడానికి ఇది చాలా పాత పద్ధతి. ఇక ఇందుకోసం ఒక బకెట్‌ను నీటితో నింపండి. అలాగే అందులోకి కొంచెం రాతి ఉప్పుని కూడా కలపండి. ఇక అందులో పాదాలను కొంత సమయం పాటు ఉంచండి. ఈ నీటిలో కాస్త వెనిగర్ కూడా యాడ్ చేయవచ్చు. దీంతో మీ పాదాలకు మంచి విశ్రాంతి అనేది కూడా లభిస్తుంది.అలాగే వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇంకా చాలా సార్లు కూడా శరీరంలో అధిక టాక్సిన్ కారణంగా, పాదాలలో మంట ఇంకా అలాగే దురద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఎక్కువ మొత్తంలో నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ అనేవి ఈజీగా బయటకు వెళ్లిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: