నేటి కాలంలో బీపీతో బాధపడేవారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ఈ సమస్యతో బాధపడడం వల్ల చాలా రకాల ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే చాలా వారికి ఎలాంటి లక్షణాలు లేవని వారికి బీపీ లేదని భావిస్తూ ఉంటారు. కానీ లక్షణాలు లేనప్పటికి చాలా మంది బీపీతో బాధపడుతన్నారని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. అందుకే మనం ఎప్పటికప్పుడు బీపీకి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇంకా అలాగే బీపీ అదుపులో ఉండాలన్నా లేని వారికి రాకుండా ఉండాలన్నా ముందుగా మనం ఉప్పును ఖచ్చితంగా మానేయాలి. కానీ ఉప్పును మానేయడం మాత్రం చాలా వరకు అసాధ్యమనే చెప్పాలి.ఇక ఉప్పును తక్కువగా తీసుకుంటూనే సహజ సిద్దంగా లభించే సొరకాయతో జ్యూస్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


సొరకాయలో టెట్రాసైక్లిక్ ట్రైటెర్పెనోయిడ్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంతో పాటు రక్తనాళాలు వ్యాకోచించేలా చేయడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. కనుక బీపీతో బాధపడే వారు అలాగే బీపీ రాకుండా ఉండాలనుకునే వారు రోజూ 250 ఎమ్ ఎల్ నుండి 300 ఎమ్ ఎల్ వరకు సొరకాయ జ్యూస్ ను తీసుకోవచ్చు. లేత సొరకాయను పొట్టు తీయకుండా జ్యూస్ లాగా చేసుకుని వడకట్టి తేనె కలిపి తీసుకోవాలి. సొరకాయ జ్యూస్ ను తాగడం వల్ల రక్తనాళాల్లో సంకోచ వ్యాకోచాలు చక్కగా జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు సొరకాయ జ్యూస్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని  శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. ఎందుకంటే సొరకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇంకా అలాగే 100 గ్రాముల సొరకాయలో 300 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. బీపీని అదుపులో ఉంచడంలో పొటాషియం మనకు చాలా బాగా సహాయపడుతుంది. సొరకాయ జ్యూస్ ను తాగడం వల్ల రక్తనాళాలకు ఉండే సాగే గుణం పెరుగుతుంది. అందువల్ల బీపీ అదుపులో ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: