టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ ప్రకటించిన క్షణం నుంచే అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, అనుకోని కారణాల వల్ల చిన్న అంతరాయం కలిగింది. ఎన్టీఆర్ గత కొన్ని రోజులుగా జలుబుతో ఇబ్బంది పడుతుండటంతో చిత్ర బృందం చిత్రీకరణకు స్వల్ప విరామం ఇచ్చింది. హీరో ఆరోగ్యం కంటే మరేదీ ముఖ్యం కాదని భావించిన ప్రశాంత్ నీల్, షూటింగ్ షెడ్యూల్‌ను కాస్త వెనక్కి జరిపారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో రాత్రి సమయాల్లో చిత్రీకరణ జరుగుతుండటంతో వాతావరణ మార్పుల వల్ల ఎన్టీఆర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.


సినిమా చిత్రీకరణ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లు నిర్మించారు. రాత్రి పూట చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ తారక్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఆయన శ్రమిస్తున్న తీరు చూసి యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటుండగా, ఆయన కోలుకున్న వెంటనే తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. మేకర్స్ ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం షూటింగ్‌ను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రశాంత్ నీల్ మార్కు ఎలివేషన్లు, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కలగలిసి బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


సినిమా విడుదల తేదీ విషయంలో మేక‌ర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తొలుత ఈ సినిమాను 2026 జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటంతో 2027 సంక్రాంతి బరిలో నిలపాలని నిర్మాతలు యోచిస్తున్నారు. సంక్రాంతి సీజన్ ఎన్టీఆర్ చిత్రాలకు ఎప్పుడూ కలిసి వచ్చే అంశం కావడంతో ఈ మార్పు చేసినట్లు వినికిడి. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, ఆమె నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్ కపూర్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతుండటం సినిమా స్థాయిని మరింత పెంచింది.


ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ కథలో ఉండే డార్క్ థీమ్, ఎమోషన్స్ ఈ సినిమాలో పీక్స్‌లో ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించింది. కేజీఎఫ్, సలార్ సినిమాల‌తో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నీల్, ఈసారి తారక్‌తో ఎలాంటి వండర్స్ చేస్తారోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సినిమాలోని కొన్ని కీలక ఘట్టాలను విదేశాల్లో కూడా చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఆరోగ్యం కుదుటపడగానే చిత్ర బృందం మళ్ళీ సెట్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం తథ్యమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: