రష్యా భారత్ తో స్నేహం చేస్తూనే రెండు సార్లు మోసం చేసింది. ఒకటి ఇండియా ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో 77 లో మొదటి సారి అణ్వయుధ పరీక్షలు చేపడితే దాన్ని తెర వెనక అమెరికాతో కలిసి అణు పరీక్షలు చేయకుండా ఆంక్షలు విధించింది.  మరో సారి బంగ్లా దేశ్ విభజన సమయంలో పాక్ తో యుద్ధం సమయంలో ఇండియా 90 వేల మంది పాక్ సైనికులను  అదుపులోకి తీసుకుంది.


పాక్ ఇండియా సైనికులకు 3 వేల మందిని అదుపులోకి తీసుకుంది. అప్పుడు కూడా పాకిస్థాన్ వైపు వకల్తా పుచ్చుకుని రష్యా పాక్ సైనికులను విడిపించేలా చేసింది. అదే సమయంలో ఇండియా సైనికులను మాత్రం విడిపించే ప్రయత్నం చేయలేదు. మరో సారి చైనాతో భారత్ యుద్ధం చేసిన సమయంలో భారత్ భూభాగాన్ని కొన్ని వందల కిలోమీటర్లు ఆక్రమించుకున్న దాని గురించి చైనాతో మాట్లాడి ఇప్పించలేదు. ఇలా కార్గిల్ యుద్దం సమయంలో కూడా సహకరించలేదు.


దాదాపు అణు పరీక్షలను రహస్యంగా ప్రధాని వాజ్ పేయి హయాంలో నిర్వహించాల్సి వచ్చింది. ఫోఖ్రాన్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించి భారత్ అణ్వస్త్ర దేశంగా మారడంతో అప్పుడు స్నేహబంధాన్ని మరింత పెంపొందించుకుంది. అయితే ప్రస్తుతం భారత్ 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూ సందేశాన్ని పంపారు. భారత్ ప్రపంచంలో ఎదుగుతున్న ఒక మహోన్నత శక్తి అని అన్నారు.


గ్లోబల్ లో పటిష్ట దేశం భారత్ అని ప్రశంసించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా భారత్ కు స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో భారత్ శక్తి ఏంటో అందరికీ తెలిసిపోయింది. భారత్ ప్రపంచంలో ప్రస్తుతం అయిదో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. మెల్లి మెల్లిగా ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తుంది. ఇలాంటి సమయంలో మిత్ర దేశాలతో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం భారత్ కు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: