ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తుంది. ఈ యుగంలో ఎక్కువ మంది పిల్లలు ఫోన్ తోనే చాలా ఎక్కువ సమయం గడపుతున్నారు. అందువల్ల వల్ల వారికి శారీరక వ్యాయామం అస్సలు ఉండడంలేదు.ఇంకా అలాగే బయట ఆటలు ఆడకపోవడంతో ఎముకల బలం పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే పిల్లలను వీలైనంతగా అవుట్ డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహిస్తే ఎముకల బలం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.శరీరంలో విటమిన్-కె ఇంకా మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఎక్కువ ఎముకల సాంద్రతతో ఉంటారని ఆరోగ్య నిపుణుల వాదన. అందుకే మన పిల్లలకు ప్రతి రోజు కూడా బచ్చలి కూర, క్యాబేజి ఇంకా అలాగే ఆకుపచ్చ కూరగాయలతో ఆహారం పెడితే విటమిన్-కె ఇంకా మెగ్నీషియం బాగా వృద్ధి చెందుతాయి. అలాగే అల్పాహారంలో తృణధాన్యాలు ఇంకా మొలకలు వంటి ఆహరాన్ని చేరిస్తే ఖచ్చితంగా వారికి చాలా ప్రయోజనాలు ఉంటాయి.మన ఎముకల నిర్మాణంలో కాల్షియం ఖచ్చితంగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే కాల్షియం వల్ల గుండె ఆరోగ్యం కూడా చాలా బాగా మెరగవుతుంది. పాలు, పెరుగు ఇంకా జున్ను వంటి ఆహారాలు తీసుకుంటే కాల్షియం ఖచ్చితంగా వృద్ధి చెందుతుంది.


తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లల ఎముకల ఆరోగ్యం కోసం ప్రతి రోజు కనీసం రెండు గ్లాసుల పాలు తాగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇంకా అలాగే ప్రతి రోజూ కూడా పెరుగన్నం తినేలా  చూడాలి. అలాగే వారానికి మూడు రోజులైనా ఆహారంలో ఆకు కూరలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా అలాగే సోయా బీన్స్ ను ఎక్కువగా పెడితే కూడా కాల్షియం వృద్ధి చెందుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.విటమిన్-డి ఎముకల ఆరోగ్యం పెంచడంలో చాలా బాగా సాయం చేస్తుంది. అలాగే మన శరీరం కాల్షియం గ్రహించడంలో కూడా ఇది సాయం చేస్తుంది. విటమిన్ -డి శరీరాన్ని ఎముకల వ్యాధులకు గురి కాకుండా కాపాడుతుంది. విటమిన్ డి పెంచుకునేందుకు పొద్దున్నే సమయంలో సూర్యరశ్మి శరీరానికి తాకేలా వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణుల సూచన. ఎందుకంటే ఈ సూర్మరశ్మి నుంచి శరీరంలో విటమిన్-డి సంగ్రహిస్తుంది.వారానికి రెండు నుంచి మూడు రోజులు కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు సూర్యరశ్మి పొందేలా పిల్లల్ని చూసుకోవాలి. ఇంకా అలాగే చీజ్ ఇంకా చేపలు వంటి ఆహారాన్ని తింటే విటమిన్-డి శరీరానికి బాగా పుష్కలంగా అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: