మన ఆయుర్వేదం అనేది కాలానుగుణ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే ఒక చక్కటి ఎంపిక. అయితే ఇందులో ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద టీ ఉంది.ఇది దగ్గు ఇంకా అలాగే జలుబును చాలా ఈజీగా నయం చేస్తుంది.అయితే ఈ ఆయుర్వేద టీ ప్రత్యేకత ఏమిటంటే మీరు దీన్ని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే దీనితో పాటు, ఈ టీలో ఉపయోగించే పదార్ధాలు కూడా మీకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. మరి దీన్ని తయారు చేసే విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా  మీరు 1 గ్లాసు నీళ్ళు తీసుకుని, ఇక అందులో 1 టేబుల్ స్పూన్ పొడి గులాబీ రేకులను వేయండి. అలాగే అర టీస్పూన్ తురిమిన అల్లం తీసుకుని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టి, ఫిల్టర్ చేసిన తర్వాత గది ఉష్ణోగ్రత వచ్చే దాకా వేచి ఉండండి, ఆ తరువాత అందులో సగం నిమ్మకాయ, 1 టీస్పూన్ తేనె వేసి కొంచెం కొంచెం త్రాగాలి.ఇది రోజ్ యాంటిట్యూసివ్, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉంది.


ఇది ఎక్స్‌పెక్టరెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ ఇంకా అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది.ఇక అల్లం అనేది దగ్గు జలుబును నివారించడానికి ఉత్తమమైన మూలిక. ఇది గొంతులో వాపును తొలగించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే ఊపిరితిత్తులలో పేరుకుపోయిన అదనపు కఫాన్ని కరిగించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.అలాగే నిమ్మకాయలో విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అలాగే త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. దీని వేడి శక్తి శరీరం నుండి అదనపు కఫాను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఈ విధంగా పైన పదార్ధాలతో తయారు చేసిన ఈ ఆయుర్వేద టీని త్రాగడం వల్ల దగ్గు, జలుబును తగ్గించవచ్చు.అలాగే యాంటీబయాటిక్స్ జోడించకుండా మీ గొంతును ఉపశమనం చేయడానికి ఇది మంచి పానీయంగా పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: