ఈమధ్య కాలంలో దీర్ఘ కాలిక రోగాలు లేని ఇల్లు లేదని పరిశోధకులు పరిశోధనలు చేసి మరీ నిరూపిస్తున్నారు. దీనికి కారణం వారి జీవనశైలి,ఆహారపు అలవాట్లు, వాతావరణంలో కాలుష్యం, పుడ్ లో కల్తీ వంటి రకరకాల కారణాలను కూడా ఎత్తి చూపిస్తూ ఉన్నారు. చాలామంది దీర్ఘకాలిక రోగాలతో సఫర్ అవుతూ,వాటిని తగ్గించుకోవడానికి రకరకాల రసాయనాలు వాడిన మందులు వేసుకుంటూ ఇతర దుష్ప్రభావాలను కూడా కొనితెచ్చుకుంటూ ఉన్నారు.కానీ హిందూ సాంప్రదాయంలో ఉన్న ఆయుర్వేద వైద్యం వీటన్నిటికీ చెక్ పెడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఆయుర్వేద చికిత్సలో భాగంగా అరటి నీరు చాలా బాగా ఉపయోగపడుతుందని సూచిస్తూ ఉన్నారు.అస్సలు అరటి నీరు వల్ల ఎలాంటి రోగాలను తరిమికొట్టొచ్చో మనము తెలుసుకుందాం పదండి..

అరటి నీరు ఎలా తీయాలి..

సాధారణంగా అరటిపండు,అరటిఆకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి కదా.అటువంటి అరటి నీరు వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కానీ అసలు ఎలా తీయాలో చాలామందికి తెలియదు. సాధారణంగా అరటిపండ్లు కోసిన తర్వాత అరటి మొక్కను నరికేస్తూ ఉంటారు.కానీ అలా మొదల్లకే నరకకుండా సగభాగానికి నరికి,మధ్యలో కాండంని తీసేసి చుట్టూ బొంగులా ఉండేలా చూసుకోవాలి.అరటి బొంగును ఆకులు వేసి గాలి చొరబడకుండా మూత కట్టేయాలి.ఇలా దీనిని ఒక రోజంతా వదిలేస్తే రెండు నుంచి మూడు గ్లాసుల నీరు తేలుతుంది.ఆ నీటిని తీసుకొని జీలకర్ర కానీ,తేనే కానీ కలిపి రోజు తీసుకోవడం చాలా మంచిది.

దీనిలోని విటమిన్ b6 పుష్కళంగా లభిస్తుంది.ఇది రక్తంలోని గ్లూకోజ్ లెవల్సిని కంట్రోల్ లో ఉంచి మధుమేహాన్ని దూరం చేస్తుంది.మరియు ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరిచి,గ్యాస్,ఉబ్బరం వంటి సమస్యలను దరిచేరకుండా కాపాడుతుంది.అంతే కాక ఇందులోని యాంటీ ఆక్సిడెంట్,ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కారకమైన ప్రియురాడికల్స్ తో పోరాడి,క్యాన్సర్ ను దరి చేరనివ్వదు.ఇందులో చెడు కొలెస్ట్రాల్ నీ కరిగించే గుణం ఉంటుంది.దీనితో గుండె సమస్యలు దూరం అవుతాయి.

కావున మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతుంటే ఈసారి అరటి మొక్కలు ఉన్నవారి దగ్గర నుంచి అరటి నీరు తెప్పించుకొని తాగండి.మీ వ్యాధులన్నీ తరిమెయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: