అలాంటి వాటిలో బే ఆకు సాగు కూడా చాలా లాభదాయకమైనది అని చెప్పవచ్చు. ఇప్పటికే చాలామంది ఈ సాగు ద్వారా లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారు. తక్కువ ఖర్చు.. తక్కువ శ్రమతో కూడిన ఈ బే ఆకు సాగు భారీ లాభాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ బే ఆకుల సాగుకు ప్రభుత్వం కూడా సబ్సిడీ అందజేస్తోంది కాబట్టి మీరు మొక్కల పెంపకం ఎలా ప్రారంభించాలో తెలుసుకుంటే సరిపోతుంది. అంతే కాదు ఒక్క సారి నాటితే చాలు చాలా సంవత్సరాల పాటు మీకు దిగుబడిని అందించడం విశేషం. ఇక ఈ సాగు లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మానవశక్తి అవసరం లేకుండా యంత్రాల ద్వారానే పని జరిగిపోతుంది.
ఎలా సాగు చేయాలి అనే విషయానికి వస్తే .. మొక్కకు.. మొక్కకు..నాలుగు నుంచి ఆరు మీటర్ల దూరంలో నాణ్యమైన బే ఆకు మొక్కలను నాటాలి. క్రమం తప్పకుండా నీటిని అందివ్వాలి. బే ఆకు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు మీరు మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది కదా అందులో ఏవైనా కూరగాయలను నాటడం వల్ల అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఎవరైతే సాగు చేస్తారో అటువంటి రైతులకు జాతీయ ఔషధ మొక్కల బోర్డు 30 శాతం సబ్సిడీ కూడా అందిస్తుంది. సబ్సిడీ పొందాలి అంటే జాతీయ ఔషధ మొక్కల బోర్డు కి దరఖాస్తు చేసుకోవాలి. ఇక మీరు 25 బే ఆకుల మొక్కలను నాటి నట్లయితే ప్రతి సంవత్సరం రూ.75 వేల నుండి రూ.1. 25 లక్షల వరకు లాభం పొందవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి