బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాకు ధీటుగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్స్ గా నిలుస్తాయని తెలుస్తుంది.


రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న ఈ సాహో సినిమా నుండి మ్యూజిక్ డైరక్టర్స్ శంకర్ ఎహసన్ లాయ్ తప్పుకున్నట్టుగా తెలిపారు. మ్యూజిక్ త్రయం శంకర్ ఎహసన్ లాయ్ సాహో నుండి తప్పుకోడానికి గల కారణాలు ఏంటన్నది తెలియలేదు.. కాని రిలీజ్ ఇంకా 80 రోజులు మాత్రం ఉన్న ఇలాంటి టైంలో సినిమా నుండి వారు తప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.


ఇక వారి ప్లేస్ లో ఇప్పటికిప్పుడు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది హాట్ న్యూస్ గా మారింది. సుజిత్ మొదటి సినిమాకు మ్యూజిక్ అందించిన జిబ్రాన్ ను సాహోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇప్పటికే అతనితో డిస్కషన్స్ చెస్తున్నారట. అతను కాకుంటే తమన్ ను సెలెక్ట్ చేస్తారని తెలుస్తుంది.


సాహో సినిమాకు సడెన్ గా మ్యూజిక్ డైరక్టర్స్ ఇచ్చిన షాక్ కు దర్శక నిర్మాతలు కన్ ఫ్యూజన్ లో పడ్డారు. తమన్.. జిబ్రాన్ ఇద్దరిలో ఎవరు ఈ సినిమాకు పర్ఫెక్ట్ అన్నది తెలియాల్సి ఉంది. టాలీవుడ్ లో ఇప్పుడు తమన్ మంచి ఫాంలో ఉండగా భారీ బడ్జెట్ మూవీ కాబట్టి అతను హ్యాండిల్ చేస్తాడా లేదా అనే డౌట్ లో ఉన్నారు నిర్మాతలు. జిబ్రాన్ మాత్రం డిఫరెంట్ మ్యూజిక్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. అయితే మనోడు పాటలు మాత్రం అంతగా క్లిక్ అయిన సందర్భాలు లేవు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో తెలియాల్సి ఉంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: