తెలుగులో విభిన్నమైన కథలు ఎంచుకునే యంగ్ హీరో శర్వానంద్. ఆయన ఎంచుకునే కథాంశాలు విభిన్నంగా ఉంటాయి. "శతమానం భవతి "లాంటి మంచి హిట్ అందుకున్న శర్వానంద్ ప్రస్తుతం  చాలా బిజీగా ఉన్నాడు. తమిళంలో హిట్ అయిన 96 సినిమాని తెలుగులో శర్వానంద్ హీరో గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత కథానాయికగా నటిస్తుంది. తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

 

96 సినిమా చిత్రీకరణలో ఉండగానే శర్వా తన తర్వాతి సినిమా  రణరంగం టీజర్ విడుదలకు సిద్ధమవుతున్నారు. రణరంగం సినిమాకు " సుధీర్ వర్మ" దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ లుక్స్ తో శర్వానంద్ కనిపించే ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా కాజల్ - కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. 29 వ తేదీ సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకి టీజర్ ను వదలనున్నారు.

 

ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో రఫ్ లుక్ తో శర్వానంద్ ఆకట్టుకుంటున్నాడు. టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలను పెంచేయాలనే ఆలోచనలో వున్నారు. ఇంతకుముందు శర్వానంద్ చేసిన 'పడి పడి లేచె మనసు' పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలనే ఆశతో ఆయన వున్నాడు. కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ పరిస్థితి కూడా అంతే. వాళ్లకి కూడా ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరం.

 

సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో  పిడివి ప్రసాద్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్ వరుస్ సినిమాలకు సంతకాలు చేస్తున్నాడు. లఘు చిత్రాల దర్శకుడు "కిషోరుడు" తో ఒక సినిమా ఒప్పుకున్నాడు. కిషోరుడు చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమాని అంగీకరించాడు. తర్వాత తమిళ దర్శకుడితో ఒక సినిమాకి చర్చలు జరుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: