త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అ..ఆ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ మళ్ళీ భీష్మ తోనే ఫాంలోకి వచ్చాడు. ఈ రెండు సినిమాల మధ్యలో వచ్చిన  లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం వరసగా ఫ్లాపయ్యాయి. అందుకే గ్యాప్ తీసుకున్న నితిన్ చేసిన పొరపాటేంటో తెలుసుకొని మంచి కథలని ఎంచుకొని వరసగా వాటిని సెట్స్ మీదకి తేవాలనుకున్నాడు. ఇంతలో కరోనా వచ్చి నితిన్ అనుకున్న ప్లాన్స్ ని దెబ్బ తీసింది. 

 

ప్రస్తుతం రంగ్ దే టైటిల్ తో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్నాడు నితిన్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా... సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్.. నితిన్, కీర్తి సురేష్పోస్టర్ కి జనాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం మిగిలి ఉన్న టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసేందుకు సన్నాహాలలో ఉన్నాడు. 

 

సినిమా తర్వాత కూడా మరో రెండు సినిమాలని లైన్ లో పెట్టినట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. వాటిలో ఒకటి కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కబోయో హిందీ అంధాధున్ తెలుగు రీమేక్ కాగా మరొకటి టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా. 

 

ఇప్పటి వరకు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మిస్టరీ, సస్పెన్స్ బ్యాగ్డ్రాప్ లో రూపొందినవే. ఛార్మి నటించిన అనుకోకుండా ఒకరోజు, సాహసం లాంటి సినిమాలని చూసిన వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. ఇప్పుడు నితిన్ తో చంద్రశేఖర్ యేలేటి చేయబోయో సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో రూపొందబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాకి ‘చదరంగం’ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా నితిన్ మొదటిసారి ఇలాంటి జోనర్ లో నటించబోతున్నాడు.    

మరింత సమాచారం తెలుసుకోండి: