వరుస సినిమాలు తీస్తూ అతి తక్కువ సమయంలోనే నేచురల్ స్టార్ నాని గా మారిపోయారు. అంతేకాదు ప్రస్తుతం ఆయన నిర్మాతగా పలు సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని,సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వి'. ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకుడు. క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉగాది కానుకగా మర్చి 25 ‘న రిలీజ్ చేయాలనీ నిర్మాత దిల్ రాజు అనుకున్నాడు. కానీ కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోవడంతో ఈ సినిమా కూడా ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అయితే నాని వి సినిమా కూడా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని కొందరు ప్రోత్సహించినా దర్శకనిర్మాతలు దానికి నో అన్నారు.
కొంచెం ఆలస్యం అయినా సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని అన్నారు. అయితే ప్రస్తుతం థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవరికీ తెలియదు. త్వరలోనే థియేటర్లు ఓపెన్ అవ్వాలని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే వి సినిమాలో నాని సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్నారు. ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్ కలిగివుంటుందట. ఇక మరో హీరో సుధీర్ పోలీస్ పాత్ర చేస్తున్నారు. వీరి మధ్య నడిచే వార్ మూవీలోని ఆసక్తి కర అంశం అని తెలుస్తుంది. అన్నీ కుదిరితే ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుందట చిత్ర బృందం. మరి పరిస్థితులు మెరుగుపడి సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి.