ఎవరెస్ట్ అంత ఎత్తులో ఉన్న ప్రభాస్ రేంజ్ ని ఇప్పుడు అందుకోవడం సౌత్ సినిమా ఇండస్ట్రీ తో పాటు నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరు అందుకోవడం అసాధ్యం అని ప్రతీ ఒక్కరు చెప్పుకుంటున్నారు. ప్రభాస్ అంటేనే ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ కాదు.. హాలీవుడ్ రేంజ్ హీరో అని గొప్పగా చెప్పుకుంటున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. త్వరలో 'రాధే శ్యామ్' చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్సినిమా చేయబోతున్నాడు. ప్రభాస్ కెరీర్లో 21వ సినిమా తెరకెక్కబోతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ సమర్పణలో ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మిస్తున్నారు.  

సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో హాలీవుడ్ టెక్నికల్ టీం తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకుణే హీరోయిన్ గా నటించనుంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతమందిస్తున్నాడని తెలుస్తుంది. అలాగే బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అన్న సినిమాలో నటించబోతున్నట్టు రీసెంట్ గా వెల్లడించారు.

వాస్తవంగా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సింది. కాని ఎప్పటికప్పుడు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకి ఆదిపురుష్ తో నేరుగా బాలీవుడ్ లో ఎంటరవబోతున్నాడు. అయితే బాలీవుడ్ లో సక్సస్ ఫుల్ సిరీస్ ధూమ్ 4 లో ప్రభాస్ ని నెగిటివ్ రోల్ లో చూడాలన్నది ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరికి ఎప్పటినుంచో ఉన్న కోరిక. ఆ కోరిక త్వరలో తీరనుందట. ఇప్పటికే ధూమ్ సిరీస్ మేకర్స్ ప్రభాస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమచారం.  ​​​​​

మరింత సమాచారం తెలుసుకోండి: