ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరు సంపాదించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘జీన్స్’ చిత్రాన్ని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 1998 లో విడుదలైన ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రశాంత్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో అలరించాడు. ఐశ్వర్య రాయ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

ఏ.ఆర్.రెహమాన్ సంగీతంలో రూపొందిన పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా పాటలు ఆడియో పరంగా ఎంత హిట్ అయ్యాయో, విజువల్ పరంగా అంత హిట్ అయ్యాయి. అప్పట్లో ఈ సినిమాలోని పాటలు ఆడియన్స్ కి కనుల పండుగ లాగా నిలిచిపోయాయి. అంతలా ఆకట్టుకుంటాయి ఈ సినిమా పాటల విజువల్స్..  ప్రశాంత్ , ఐశ్వర్య రాయ్ ల పెయిర్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. అప్పట్లో ఈ జంట కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ గా చరిత్రలో నిలిచిపోయింది.

ఇక అసలు విషయం ఏమిటంటే.. 22ఏళ్ళ తరువాత ఈ జంట మళ్ళీ కలిసి నటించబోతున్నారనేది తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాదున్’ ను తమిళంలో కూడా రీమేక్ చెయ్యబోతున్నారట. ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను ప్రశాంత్‌ తండ్రి.. అలాగే ప్రముఖ నిర్మాత అయిన తియగరాజన్ కొనుగోలు చేశారట. అక్కడ టబు నటించిన పాత్రకు తమిళంలో ఐశ్వర్యరాయ్‌ని ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించారట తియగరాజన్.

అయితే ఆమె నుండీ ఇంకా రెస్పాన్స్ రాలేదట. ఒకవేళ ఐశ్వర్య రాయ్ కనుక ఓకే చెబితే.. 22 ఏళ్ళ తరువాత ప్రశాంత్, ఐశ్వర్య రాయ్ లు కలిసి నటించే అవకాశం ఉందని తియగరాజన్ ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: