టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఒక పక్క టాలీవుడ్ సినిమాలు మరో పక్క బాలీవుడ్ సినిమాలు ఒప్పుకుని ఈమె రెండు చేతులా సంపాదిస్తుంది. ప్రస్తుతానికి ఈమె బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యాం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా మీద కూడా భారీగానే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈమె పరిస్థితి కేక్ వాక్ లాగానే ఉంది. అంటే పెద్దగా కష్టపడకుండానే స్టార్ల సరసన అవకాశాలను అందిపుచ్చుకుని మంచిగా రెవిన్యూ జనరేట్ చేసుకుంటోంది. అయితే ఎప్పటికీ ఇలాంటి సినిమాలు చేస్తే తనకు కమర్షియల్ ముద్ర పడుతుందని భావిస్తుందో ఏమో ఈ భామ తాను ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు రెడీగా ఉన్నానని దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం.

నిజానికి ఇలాంటి ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు సరిగా ఆడడం లేదని అనుష్క మొదలు సమంతా నయనతార కీర్తి సురేష్ లాంటిహీరోయిన్లు కూడా మళ్లీ వాటి జోలికి పోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమా కూడా చేయని ఈ భామ మాత్రం ఆ సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నట్టు గమనార్హం. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో అని టక్కరి దొంగలో మహేష్ బాబు ఫీల్ అయినట్టు ఈ భామ కూడా ఫీలవుతున్నట్టు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: