ఈ రోజు అంటే ఆదివారం.. గ్యాంగ్ లీడర్ చిత్రంలో హీరోగా నటించిన చిరు, కీలక పాత్రలు పోషించిన మురళీ మోహన్ , శరత్ కుమార్ లు రామోజీ ఫిల్మ్ సిటీలో అనుకోకుండా కలిశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరు ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో శరత్ కుమార్ ఏమో మణిరత్నంతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆర్కా మీడియా నిర్మిస్తున్న ఓ సినిమాలో మురళీ మోహన్ నటిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సినిమాలు మూడూ రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగులు జరుపుకుంటున్నాయి. దీంతో యాదృచ్చికంగా ఈ ముగ్గురూ ఒకరిని మరొకరు కలిశారు. ఈ క్షణాన్ని కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వీళ్లను చూస్తుంటే అప్పటి ‘గ్యాంగ్ లీడర్’ రోజులు గుర్తొస్తున్నాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు ఏమంటారు?
ఈ రోజు అంటే ఆదివారం.. గ్యాంగ్ లీడర్ చిత్రంలో హీరోగా నటించిన చిరు, కీలక పాత్రలు పోషించిన మురళీ మోహన్ , శరత్ కుమార్ లు రామోజీ ఫిల్మ్ సిటీలో అనుకోకుండా కలిశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరు ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో శరత్ కుమార్ ఏమో మణిరత్నంతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆర్కా మీడియా నిర్మిస్తున్న ఓ సినిమాలో మురళీ మోహన్ నటిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సినిమాలు మూడూ రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగులు జరుపుకుంటున్నాయి. దీంతో యాదృచ్చికంగా ఈ ముగ్గురూ ఒకరిని మరొకరు కలిశారు. ఈ క్షణాన్ని కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వీళ్లను చూస్తుంటే అప్పటి ‘గ్యాంగ్ లీడర్’ రోజులు గుర్తొస్తున్నాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు ఏమంటారు?