మెగాస్టార్ చిరంజీవి 1990వ దశకంలో చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో వచ్చిన చాలా మెగాస్టార్ సినిమాలు రికార్డులు బద్దలు కొట్టాయి. కలెక్షన్ల మోత మోగించాయి. వాటిలో ఒకటి ‘గ్యాంగ్ లీడర్’. ఈ సినిమా మెగాస్టార్ క్రేజ్ ని అమాంతం పెంచేసిందని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా.. చిరు కెరీర్ లో బెస్ట్ సినిమాలో ఒకటి. విజయ బాపినీడు తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. మురళీ మోహన్, శరత్ కుమార్ లు కూడా ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సంగతంతా ఎందుకు చెప్తున్నారు? అనే డౌట్ వస్తోందా? దీనికి ఓ బలమైన కారణం ఉందండీ. అదేంటంటే.. ఈ గ్యాంగ్ లీడర్ బ్యాచ్ మళ్లీ కలిసింది. అయితే ఇది యాదృచ్ఛికం కావడం విశేషం.

ఈ రోజు అంటే ఆదివారం.. గ్యాంగ్ లీడర్ చిత్రంలో హీరోగా నటించిన చిరు, కీలక పాత్రలు పోషించిన మురళీ మోహన్ , శరత్ కుమార్ లు రామోజీ ఫిల్మ్ సిటీలో అనుకోకుండా కలిశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరు ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో శరత్ కుమార్ ఏమో మణిరత్నంతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆర్కా మీడియా నిర్మిస్తున్న ఓ సినిమాలో మురళీ మోహన్ నటిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సినిమాలు మూడూ రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగులు జరుపుకుంటున్నాయి. దీంతో యాదృచ్చికంగా ఈ ముగ్గురూ ఒకరిని మరొకరు కలిశారు. ఈ క్షణాన్ని కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వీళ్లను చూస్తుంటే అప్పటి ‘గ్యాంగ్ లీడర్’ రోజులు గుర్తొస్తున్నాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు ఏమంటారు?

మరింత సమాచారం తెలుసుకోండి: