రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు ఒప్పుకొని ఏమాత్రం ఖాళీ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే..అయితే మిగతా అన్ని సినిమాలతో పోలిస్తే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా మీద కాస్త ఎక్కువ ఆసక్తి నెలకొని ఉంది అనేది కాదనలేని వాస్తవ. ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయం వార్తల్లోకి వస్తూనే ఉంటుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కారణంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అదీగాక ప్రభాస్ కి ఇది మొట్టమొదటి బాలీవుడ్ డైరెక్ట్ మూవీ కానుంది. 

ఇక ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోంది.. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ మధ్యనే మొదలైంది.. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మరోపక్క ఆసక్తికర అంశం ఏమిటంటే అయోధ్య రామాలయం కూడా వచ్చే ఏడాదికి నిర్మాణం పూర్తి కావాలనేది కేంద్రం ఆలోచన. అంటే ఆ అయోధ్య రామాలయం పూర్తయ్యేనాటికి ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదీకాక ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుకు బి.జె.పి తో సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ ఆదిపురుష్ సినిమాకి బీజేపీ సపోర్ట్ చేస్తుంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు స్వయానా బీజేపీ నేత ఆయన 98 లో లోక్ సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పుడు ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా వరించింది. ఈ విషయాలు ఎలా ఉన్నా సరే హిందుత్వం అంటే తామే అని చెప్పుకునే బిజెపి ప్రభాస్ క్రేజ్ ను తాము వాడుకుంటూ , ప్రభాస్ సినిమాకి మద్దతు పలకాలని భావిస్తోందని ప్రచారం బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: