టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా ఇండస్ట్రీ లో కొనసాగుతూ వున్నా కాని స్టార్ హీరో కాలేకపోయాడు. మంచి మంచి సినిమాలు చేసిన కాని యూత్ లో పెద్ద క్రేజ్ లేనందువల్ల స్టార్ హీరో అవ్వలేకపోయాడు. ఇక గతంలో వచ్చిన "మహానుభావుడు" సినిమా శర్వానంద్ కి చివరి హిట్. ఆ సినిమా తరువాత వరుస ప్లాపులు ఎదురుకుంటున్న శర్వానంద్ తాజాగా నటించిన తాజా సినిమా "శ్రీకారం". శర్వానంద్ కి జంటగా నానిస్ "గ్యాంగ్ లీడర్ " సినిమాలో నటించిన ప్రియాంకా అరుళ్ మోహన్ ఈ సినిమాలో నటించింది.ఇక ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.సినిమా రిలీజ్ కి ముందు విడుదల చేసిన "వస్తానంటివో" పాట యూ ట్యూబ్ లో మంచి హిట్ అయ్యింది.కిశోర్.బి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది.


ఇక ఈ చిత్రం మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలయ్యింది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి డివైడ్ టాక్ మొదలైంది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయనే చెప్పాలి. '14 రీల్స్ ప్లస్‌' బ్యానర్ పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక శ్రీకారం సినిమా వసూళ్ల విషయానికి వస్తే.. 'శ్రీకారం' చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటిరోజు ఈ చిత్రం 5.98కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 11.52 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది . పోటీగా మరో 3 సినిమాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం బాగానే రాణించింది.వీకెండ్ పూర్తయ్యేవరకూ ఇదే జోరు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ను సాధించే అవకాశం ఉంటుంది.ఇక చూడాలి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి శర్వానంద్ కి మంచి బ్రేక్ ఇస్తుందో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: