కొన్నిసార్లు హీరో హీరోయిన్స్ ఎక్కువ సినిమాల్లో నటిస్తే వాళ్ళ మధ్య ఏదో ఉందని రూమర్స్ రావడం సహజం. కానీ వాటిలో కొన్ని పెళ్లి పీటల వరకు వెళ్తాయి కొన్ని మాత్రం రూమర్స్ గానే మిగిలిపోతాయి. అలా యంగ్ హీరో రాజ్ తరుణ్ , హీరోయిన్ హెబ్బ పటేల్ మధ్య ఏదో ఉందని ఎప్పటినుంచో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనే రూమర్ వస్తూనే ఉంది. వాళ్ళు కలిసి నటించిన కుమారి 21ఎఫ్ సినిమాలో ఇద్దరి మధ్య రొమాన్స్ చూసి ఈ పుకారు మొదలైంది.

ఆ తర్వాత ఇద్దరు అందగాడు , నేను నా బాయ్ ఫ్రెండ్స్ , ఒరేయ్ బుజ్జిగా ఇలా వరసగా సినిమాలు చేశారు. దాంతో ఈ రూమర్స్ ఇంకా బలం చేకూరింది. అయితే నిజానికి ఇద్దరి మధ్య ఏమి లేదు అని షూటింగ్ లో కలవడం తప్ప బయట అసలు కలవము అని ఎన్నో సార్లు ఇద్దరు పబ్లిక్ గా చెప్పారు కానీ ఈ రూమర్స్ కి మాత్రం చెక్ పడటంలేదు.ఇక ఒక సమయంలో రాజ్ తరుణ్ హెబ్బ పటేల్ ఇద్దరు ఆ రూమర్స్ ని చూసి నవ్వుకోవడం మొదలుపెట్టారు.

ఆ విషయం ఒకసారి ఈటీవీ లో వచ్చే పటాస్ షో లో వాళ్ళ రిలేషన్ మీద జోక్స్ వేసిన కూడా ఇద్దరు నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు. ఇక ఇద్దరి కెరీర్ విషయానికి వస్తే హెబ్బ పటేల్ గ్లామర్ రోల్స్ కి కొంతకాలం కామ పెట్టి మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలని చేస్తుంది. అలాగే రాజ్ తరుణ్ కి ఈ మధ్య ఒక మంచి హిట్ రాలేదు.అందుకోసం ఆయన కొత్త తరహా సినిమాలని ఎంచుకుంటున్నారు. అలా చేస్తున్న సినిమానే స్టాండ్ అప్ రాహుల్ . ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ఆయనకి జోడిగా వర్ష బోళ్లమ్మ నటిస్తుంది. ఆమె ఇంతకముందు మెడీల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో నటించి మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: