గత కొన్ని సినిమాలుగా వరుస ప్లాపులు అందుకుంటూ ప్రేక్షకుల్లో క్రేజ్ ను కోల్పోతున్న
హీరో శర్వానంద్. ప్రస్తుతం మహాసముద్రం అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఆర్ ఎక్స్100 తో తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న
అజయ్ భూపతి సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం.
సిద్ధార్థ్ మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ
సినిమా లో అదితి రావు హైదరి, అనూ ఇమాన్యుయేల్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. శర్వానంద్ కెరీర్లో 29వ
సినిమా గా రాబోతున్న ఈ
సినిమా తో సూపర్ హిట్ కొట్టాలని శర్వా అభిమానులు ఆశిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందులోనూ
సిద్ధార్థ్ మరో హీరోగా నటించడంతో ఈ
సినిమా ఎలా ఉంటుందో అన్న అంచనాలను ఏర్పరుచుకుంది. ఇక
శర్వానంద్ 30వ
సినిమా ఓకే ఒక జీవితం
సినిమా రాబోతుంది. సైన్స్ ఫిక్షన్
సినిమా గా తెరకెక్కబోతున్న ఈ
సినిమా కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఆ ప్రోమో ఈ
సినిమా ఏవిధంగా ఉండబోతుందో తెలియజేసింది. ప్రేక్షకుల్లో ఒక్కసారిగా ఆసక్తిని పెంచింది. వినూత్నమైన సినిమాలో చేయడానికి పెద్దపీట వేసే ఈ సినిమాలో కూడా మంచి కొత్తదనాన్ని చూపించబోతున్నాడు శర్వా.
ఈ నేపథ్యంలో ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయినా సినిమాను ఒకే ఒక జీవితం
సినిమా తో పోల్చి చూస్తున్నారు కొంతమంది నెటిజన్లు. సోషల్ మీడియాలో ఈ తరహా కామెంట్లు బాగా వినబడుతున్నాయి. ముఖ్యంగా ఓకే ఒక జీవితం ప్రోమో విడుదల తర్వాత కొన్ని కొన్ని షాట్స్
శర్వానంద్ జాను సినిమాలా కనిపిస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దాని ప్రభావం ఎక్కడ ఈ సినిమాపై ఉంటుందేమోనని అభిమానులు భయపడుతున్నారు. మరి వీరి భయాన్ని తొలగించెలా
శర్వానంద్ వారి భయాన్ని ఏవిధంగా తొలగిస్తాడు అనేది చూడాలి. ఏదేమైనా
శర్వానంద్ ఇప్పుడున్న పరిస్థితిలో తప్పకుండా హిట్ కొట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.