పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా రాణిస్తున్నారు. ఆయన ఒక్కవైపు సినిమాలో చేస్తూనే మరోవైపు రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ రెండు సినిమాలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమాను చేస్తున్నారు. ఆ చిత్రానికి హరి హర వీరమల్లు అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రంలో పవన్ వ‌జ్రాల దొంగగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమా నుండి మరో అప్ డేట్ రానున్నట్లు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే సెప్టెంబర్ 2 న ఒక అదిరే పోస్టర్‌ను చిత్రబృందం లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దాంతో ఈ సినిమా తాలూకా సరికొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం

సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో చిత్రీకరిస్తున్నారు. కాగా.. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేస్తోంది చిత్ర యూనిట్. ఇక అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చారిత్రక నేపథ్యంలో పవన్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాలో పవన్ సరసన టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది. అలాగే బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని సమాచారం.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమా విషయానికి వస్తే.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీలో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి బీమ్లా నాయక్ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, నిత్యా మీనన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి సెప్టెంబర్ 2న మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ లాంచ్ చేయనున్నాట్లు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: