టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి అదృష్టం ఉన్న హీరో రవితేజ అనే చెప్పాలి. దాదాపు ఆయన కెరీర్ అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఒక హిట్ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తూ మళ్లీ ఫామ్ లోకి వస్తున్నాడుం ఆయన నటించిన గత చిత్రం క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రవితేజ మళ్ళి రిథమ్ లోకి వచ్చాడు అని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతకుముందు భారీ డిజాస్టర్ లు చేయడంతో రవితేజ సినిమాలు మానేస్తే బాగుంటుంది అని ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి.

అయితే క్రాక్ సినిమా విడుదల అయిన తర్వాత ఆ రకమైన అభిప్రాయం ప్రతి ఒక్కరిలో మారిపోయింది. ఆ సినిమా ఇచ్చిన హిట్ జోష్ లో రవితేజ ఇప్పుడు రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా మీనాక్షి చౌదరి డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చెప్పాలంటే ఈ ఇద్దరు కూడా కొత్త హీరోయిన్లు. రవితేజ ఇమేజ్ మీదనే ఈ సినిమా ఆడుతుంది అని చెప్పవచ్చు. ఇకపోతే గతంలో ఇదే డైరెక్టర్ తో రవితేజ వీర సినిమా చేయగా మళ్లీ 10 సంవత్సరాల తర్వాత అదే డైరెక్టర్ తో ఈ సినిమా చేస్తున్నాడు.

ఇది ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అనే భావన దర్శకుడు లో కనిపిస్తుండగా పది సంవత్సరాల తర్వాత అప్పుడు చేయలేనిది ఇప్పుడు ఈ సినిమా రూపం లో రవితేజ చేయగల డా అని అభిమాను లు సందేహం వ్యక్తపరుస్తున్నారు. తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడి అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ద్వారా మరొక భారీ హిట్ ఖాయం అని చెబుతున్నారు చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఒక సారి ఫ్లాప్ సినిమా చేసిన రమేష్ వర్మ ఈ సారీ హిట్ అందిస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: