బండ్ల గణేష్ కెరీయర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వెళ్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'సుస్వాగతం' సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించిన బండ్ల గణేష్ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అలాగే కొన్ని సినిమాల్లో నటించిన బండ్ల గణేష్  పరశురామ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన 'ఆంజనేయులు' సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు.

 ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో , పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ , తీన్మార్ సినిమాలను నిర్మించాడు. ఈ రెండు సినిమాలలో 'గబ్బర్ సింగ్' బ్లాక్ బస్టర్ గా నిలవడంతో తెలుగులో ఉన్న చాలా మంది స్టార్ హీరోలతో బండ్ల గణేష్ చిత్రాలు నిర్మించాడు. అలా కెరియర్ సాగిపోతున్న సమయంలో నే బండ్ల గణేష్ రాజకీయాల వైపు ఓ కన్ను వేశాడు. కానీ రాజకీయాల్లో ఎక్కువ రోజులు సమయం గడపని బండ్ల గణేష్ ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకొని అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో కనిపించి మెప్పించాడు. ఇదిలా ఉంటే  బండ్ల గణేష్ హీరోగా కొత్త అవతారం ఎత్తబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. తమిళ్ లో పార్తిబన్‌ నటించిన ‘ఒత్తు సెరుప్పు సైజ్‌7’ కి రీమేక్‌ ఇది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకు వెంకట్ చంద్ర దర్శకుడు. తమిళ హిట్ ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ లో ఆర్.పార్తిబన్ పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చెబుతున్నారు. ఇదే సినిమాను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. మరి హీరోగా బండ్ల గణేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: