మెగాస్టార్
చిరంజీవి హీరోగా
మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా
శంకర్ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్ కి వెళ్లని ఈ
సినిమా ప్రస్తుతం ప్రీ ప్రడక్షన్ పనులు జోరు వ జరుపుకుంటుంది. దీనికంటే ముందు
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ అనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఆచార్య విడుదల చేసిన తర్వాత ఒకేసారి మూడు సినిమాలు అనౌన్స్ చేసి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచిన
చిరంజీవి వచ్చే నెలలో
గాడ్ ఫాదర్ చిత్రంను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్
సినిమా తెలుగులో తనకు తప్పకుండా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తుందని భావిస్తున్నాడు చిరంజీవి. ఈ నేపథ్యంలోనే ఆయన లుసిఫర్ సినిమాను
రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇకపోతే
మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోయే
సినిమా కూడా తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాలం చిత్రానికి
రీమేక్ అన్న విషయం చాలామందికి తెలుసు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న
మెహర్ రమేష్ ఈ సినిమాపై చాలా రోజులు గా పని చేస్తున్నాడని తెలుస్తోంది.
వెంకటేష్ హీరోగా నటించిన
షాడో చిత్రం తర్వాత ఏ
హీరో కూడా ఆయనతో
సినిమా చేయడానికి ముందుకు రాలేదు. చిన్న హీరోలు సైతం
మెహర్ రమేష్ తో
సినిమా అంటే వద్దని డైరెక్టుగా చెప్పేవారు. అలాంటిది ఇప్పుడు
మెగాస్టార్ చిరంజీవి సినిమా పట్టేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ అవుతుంది. ఈ
సినిమా కోసం
మెహర్ రమేష్ పారితోషకం కాకుండా సినిమాలోని వాటా తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. నిజంగా ఒక ఫాం లో లేని దర్శకుడు ఈ రేంజ్ లో వాటా తీసుకోవడం అంటే అది గొప్ప విషయం అని చెప్పాలి. చిరు
సినిమా కాబట్టి ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తాయి.