మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'రిపబ్లిక్'.చాలా గ్యాప్ తర్వాత దేవా కట్టా డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది.ఇక ఇటీవలే విడుదలైమా5ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.ఇక గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా డైరెక్టర్ దేవా కట్టా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.గత కొద్దిరోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.కేబుల్ బ్రిడ్జి పై సాయి తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి పడిపోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

 దీంతో వెంటనే స్థానికులు హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఇక ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో తేజు చికిత్స పొందుతున్నాడు.అయితే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హెల్త్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముందు సీరియస్ గా ఉందని..ఆ తర్వాత పర్లేదు అని తేజు ఆరోగ్యం పై కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఇక సినీ ప్రముఖులు కూడా తేజు ను చూడటానికి హాస్పిటల్ కి వెళ్తున్నారు. అయితే తాజాగా దేవా కట్టా ముందు రిపబ్లిక్ సినిమా గురించి మాట్లాడుతూ.."నేను ఓన్ చేసుకొని చేసిన సినిమా ఇది.నా విజన్ లోనే సినిమా తీసేలా సాయి ధరమ్ తేజ్ నన్ను చాలా ఎంకరేజ్ చేసాడు.ఒక సైనికుడిలా నాకు అండగా నిలబడ్డాడు.

యాక్సిడెంట్ తర్వాత తేజును కలిశాను.అక్టోబర్ 1 న సినిమాను చేద్దామని అతనితో మాట్లాడిన తర్వాతే ఫైనల్ గా ఓకే చేశామని తెలిపాడు.ఇక రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తేజు చూసాడని తెలిపాడు.తను 100% రికవరీ అయ్యే వరకు ఐసోలేషన్ లో ఉంచితేనే మంచిదని డాక్టర్లు అభిప్రాయ పడ్డారని ఆయన తెలిపారు.సాయి తేజ్ త్వరగా కోలుకుంటున్నాడని..ఇప్పుడు కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నాడని..కొద్ది కొద్దిగా ఆహారం కూడా తీసుకుంటున్నాడని చెప్పాడు.ఇక తేజు పూర్తిగా కొలుకోవడానికి ఇంకొంచెం సమయం పడుతుందని తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు దేవా కట్టా...!!

మరింత సమాచారం తెలుసుకోండి: