ప్రభాస్ హీరోగా నటించిన
మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన
కొరటాల శివ అప్పటి నుంచి వరుసగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిస్తూ ఇప్పటివరకు ఒక్క పరాజయం లేకుండా అగ్ర దర్శకుడి దూసుకుపోతున్నాడు. మహేష్ బాబుతో శ్రీమంతుడు
సినిమా చేసిన ఆయన ఈ
సినిమా తో అగ్ర దర్శకుడిగా మారడని చెప్పవచ్చు. ఈ
సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు
కొరటాల శివకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చింది. ఆ తర్వాత జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.
ఆ విధంగా తక్కువ సినిమాలతోనే భారీ స్థాయి సినిమాలు చేసే దర్శకుడిగా పెద్ద పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న
కొరటాల శివ ఇప్పుడు
మెగాస్టార్ చిరంజీవితో
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ
సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిరంజీవి తో పాటు ఈ సినిమాలో
రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా నక్సలైట్స్ గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ
సినిమా తర్వాత ఆయన
ఎన్టీఆర్ తో
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి
ఎన్టీఆర్ తో
త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉండగా
కొరటాల శివ అల్లుఅర్జున్ తో
సినిమా చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ ప్రాజెక్టులు తారుమారు అయ్యాయి. ఇప్పుడు
ఎన్టీఆర్ సినిమా పైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు
కొరటాల శివ. ఈ చిత్రం కోసం ఎప్పటిలాగే సామాజిక స్పృహ ఉన్న ఓ అద్భుతమైన కథను రెడీ చేశాడని తెలుస్తుంది. అంతేకాదు ఇది ఒక రివెంజ్ డ్రామా అని కూడా చెబుతున్నారు. పొలిటికల్ నేపథ్యంలో ఈ
సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్క బోతుంది అంటున్నారు. త్వరలోనే
పూజా కార్యక్రమాలతో ఎంతో గ్రాండ్ గా మొదలు కాబోతున్న ఈ చిత్రం ఏ రేంజ్ లో తెరకెక్కుతోంది చూడాలి.