టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అసలు అంతా ఇంతా కాదు. రామ్ చరణ్ నటుడిగానే కాక నిర్మాతగా కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నారు.ఇక ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ రామ్ చరణ్ సినిమా సినిమాకు తన క్రేజ్ ను బాగా పెంచుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు విమానయాన కంపెనీ కూడా ఉన్న విషయం తెలిసిందే. ట్రూ జెట్ పేరుతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించిన ఎయిర్ లైన్ కంపెనీ సేవలను అందిస్తోంది.ఇక ట్రూజెట్ కంపెనీకి రామ్ చరణ్ ఛైర్మన్ గా ఉండగా ఈ కంపెనీలో రామ్ చరణ్ కు వాటాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. అయితే ఈ కంపెనీపై కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని ఫలితంగా రామ్ చరణ్ చరణ్ కు నష్టాలు వచ్చాయని సమాచారం అందుతోంది.


గత కొంత కాలంగా కూడా ట్రూజెట్ సంస్థ సర్వీసులు ఆగిపోవడంతో ఈ కంపెనీలో ఏం జరుగుతుందనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. 2015 వ సంవత్సరం జులై నెలలో ఈ కంపెనీ సర్వీసులు మొదలయ్యాయి.ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల వల్ల ఈ కంపెనీ పుంజుకుంటుందని అనుకున్న సమయంలోనే కరోనా వైరస్ కేసులు పెరగడంతో ఈ సమస్యలు ఏర్పడ్డాయి. ఇక రామ్ చరణ్ తో పాటు మరో ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థకు కూడా ఈ కంపెనీలో వాటాలు ఉన్నాయి. ఇతర ఎయిర్ లైన్స్ నుంచి గట్టి పోటీ కూడా ఎదురవుతుండటంతో ఈ సంస్థకు ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయని సమాచారం తెలుస్తోంది.


అలాగే గతంలో పలు రీజినల్ ఎయిర్ లైన్ కంపెనీలు సత్తా చాటాలనే ప్రయత్నాలు చేసినా కాని సక్సెస్ సాధించలేదు.ఇక ట్రూజెట్ కంపెనీ ఆ ఎయిర్ లైన్ కంపెనీల బాటలో నిలవడం అనేది గమనార్హం. ట్రూజెట్ కంపెనీ ఉద్యోగులు కూడా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని సమాచారం తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25వ తేదీన రిలీజ్ కానుంది. రామ్ చరణ్ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు ఈ సినిమా రిలీజ్ కానుండటం అనేది గమనార్హం. ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో స్టేటస్ ను అందుకుంటారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: