గత సంవత్సరం గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్'. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలై కన్నడ తో పాటు తెలుగులో కూడా భారీ రెస్పాన్స్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగా ప్లాన్ చేస్తోందట చిత్రబృందం.మార్చి 6న జేమ్స్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారని సమాచారం ఇకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారని సమాచారం.

అయితే కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ నటించిన 'జేమ్స్' చిత్రం మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇకపోతే ఆయన నటించిన చివరి సినిమా కారణంగా దీనిపై ఫ్యాన్స్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.అంతేకాదు ఈ కార్యక్రమాన్ని మార్చి 6న ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా  త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. అయితే , ఈ సినిమాకు చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా.. ప్రియా అనంద్ హీరోయిన్గా నటించారు.

కాగా తారక్-పునీత్ మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో పునీత్ సినిమా కోసం ఎన్టీఆర్ తన గాత్రాన్ని అందించారు. అంతేకాదు 'చక్రవ్యూహ' మూవీలో 'గెలయా గెలయా' అనే పాటను పాడారు.పునీత్ సినిమా కోసం ఎన్టీఆర్ పాడిన పాట కూడా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.అయితే  మెగాస్టార్ చిరంజీవి.. పునీత్ కుటుంబం మధ్య కూడా మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు బాగానే ఉన్నాయి.అయితే పునీత్.. గతేడాది అక్టోబరు 29న గుండెపోటుతో మరణించారు.కాగా  ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు, సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: