పాన్ ఇండియా సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హెరిటేజ్ లవ్ స్టోరీ `రాధేశ్యామ్`. రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి దాదాపు మూడేళ్ల విరామం తరువాత వస్తున్న సినిమా కావడం ఇంకా అలాగే దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా కావడంతో ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు అనేవి ప్రేక్షకుల్లో ఏర్పడ్డాయి.ఇక `సాహో` సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచినా కొన్ని వర్గాలని మాత్రం సినిమా సాటిస్ఫై చేయలేకపోయింది. దీంతో ఆ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఊహలకందని కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయాలన్న పట్టుదలతో ప్రభాస్ చేసిన ప్రయత్నమే ఈ `రాధేశ్యామ్`.


గత కొంత కాలంగా నుంచి కూడా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 11న వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితమే రిలీజ్ ట్రైలర్ ని విడుదల చెయ్యడం అనేది జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ట్రైలర్ ని విడుదల చేయడం అనేది జరిగింది. ఒకే సారి ఐదు భాషలకు సంబంధించిన ట్రైలర్ లు విడుదల చేశారు..ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్ లోని విజువల్స్ భారీ తన చూస్తేనే తెలిసిపోయింది.ఇక ఇదిలా వుంటే ఈ సినిమాలో ఎలాంటి విలన్ లేడని షాకింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చేసింది. అంతే కాకుండా హాలీవుడ్ పాపులర్ సినిమా `టైటానిక్` తరహాలో విషాదకర ఎండింగ్ తో `రాధేశ్యామ్` సినిమా ముగుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ నిజమో కావో తెలియాలంటే సినిమా చూడాల్సిందే..అయితే ట్రైలర్ మాత్రం చాలా కొత్తగా రిచ్ గా ఉండటంతో ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు తిరగ రాస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా వున్నారు. మార్చి 11 వ తేదీ కోసం ఎంత గానో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి: