తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వరుస హిట్ సినిమాల లో నటిస్తూ బిజిగా ఉన్నాడు. మహర్షి సినిమా నుంచి అన్నీ హిట్ సినిమాలలో నటిస్తూ తన మార్కెట్ ను డబుల్ చేసుకున్నాడు. ఇలా వరుస సినిమా లలో నటిస్తూ వస్తున్నారు.. మొన్నీమధ్య వచ్చిన సరిలెరు నీకెవ్వరు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేసిన మహేష్ కు ఇప్పుడు వరుస సినిమా అవకాసాలు వస్తున్నాయి. మరో రెండు సినిమాలలొ నటిస్తూ బిజిగా ఉన్నారు.


ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా లో నటిస్తున్నారు.. గీతా గోవిందం ఫెమ్ డైరెక్టర్  పరుశురామ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ పనులను పూర్తీ చేసుకొనే పనిలో.. త్వరలోనే అన్నీ కార్యక్రమాలను పూర్తీ చేసుకొని మే నెలలో విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ సన్నాహాలు చెస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన అన్నీ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అందులో నుంచి కలావతి సాంగ్ కూడా విడుదల అయ్యింది. ఆ సాంగ్ మంచి వ్యుస్ ను అందుకోవడంతో పాటుగా సోషల్ మీడియాలో ఫెమస్ అవుతుంది.


ఇకపోతే ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాలో నటించెందుకు రెడీ అయ్యాడు. రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి శీను తో మరో సినిమా రానుందని వార్తలు వస్తున్నాయి.ఈమధ్యనే అఖండతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నారు.మహేష్ సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రం సినిమా చేస్తున్నారు. ఆ రెండు అయ్యాక బోయపాటి తో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా సీక్వల్ ని చెయాలనె ప్లాను లో ఉన్నాడు. మరి ఎవరి సినిమా ముందు వస్తుంది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: