తాజాగా కొద్దిసేపటి క్రితం ప్రముఖ నిర్మాత అయినటువంటి అల్లుఅరవింద్ చేతుల మీదుగా కాలింగ్ సహస్ర సినిమా టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ కూడా తెలియజేశారు అల్లు అరవింద్. ఇక ఈ చిత్రం టీజర్ ఒక నిమిషం 18 సెకన్ల నిడివితో విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ లో చూపించిన ప్రతి ఒక్క సన్నివేశం కూడా సినిమాపై ఆసక్తిని పెంచేలా కనిపిస్తోంది. ఈ వీడియోలో చూస్తుంటే సుదీర్ గతంలో కంటే ఇప్పుడు సరికొత్తగా కనిపిస్తాడని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించ బడుతోంది.
అయితే త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని తెలియజేశారు చిత్రబృందం. ఇక సుధీర్ చెప్పే ప్రతి ఒక్క డైలాగ్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్య పరిచేలా కనిపిస్తోంది. ఇక ఈ టీజర్ చూస్తే ఒక మిస్టరీని తలపించే విధంగా ఉండబోతోందని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని రాధా ఆర్ట్స్, షాడో మీడియా ప్రొడక్షన్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంతటి ఈ చిత్రానికి అరుణ్ విక్కిరాల దర్శకత్వం వహించారు. సుధీర్ సరసన ఆనంద్ భయానా నటిస్తోంది. ఇక ఇందులో శివబాలాజీ, స్పందన పల్లి, తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.