నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరియర్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించాడు.  బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలో  సమరసింహా రెడ్డి సినిమా ఒకటి,  బి.గోపాల్ దర్శకత్వం వహించగా ఈ మూవీ కి విజయేంద్ర ప్రసాద్  కథను అందించాడు.  ఫ్యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది,  సమరసింహా రెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన సిమ్రాన్,  అంజలి జావేరి హీరోయిన్ లుగా నటించారు.   జయప్రకాష్ రెడ్డి, పృద్వి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు,  ఇది ఇలా ఉంటే సమరసింహా రెడ్డి సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.  సమరసింహా రెడ్డి సినిమాలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే,  అలాగే ఈ సినిమాలో సిమ్రాన్ పాత్రకు ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ లభించింది.

 ఇది ఇలా ఉంటే సమరసింహా రెడ్డి సినిమాలో మొదట సిమ్రాన్ పాత్రకు చిత్ర బృందం రాశి ని ఎంపిక చేసుకున్నారట,  కానీ రాశి మాత్రం సమరసింహా రెడ్డి మూవీ లో నటించడానికి నో చెప్పిందట.  రాశి ,  బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సమరసింహా రెడ్డి మూవీ లో నటించడానికి నో చెప్పడానికి కారణం... సమరసింహా రెడ్డి మూవీ లో నడుముపై సీతాకోకచిలుక వాలే సన్నివేశంలో రాశి అభ్యంతరం చెప్పిందట,  రాశి ఆ సన్నివేశాన్ని తొలగిస్తే సినిమాలో నటిస్తానని చెప్పేసిందట,  లేకపోతే మూవీ లో చేయనని చెప్పిందట.  దర్శక నిర్మాతలు మాత్రం ఆ సన్నివేశాన్ని తొలగించడానికి ఇష్టపడకపోవడం తో అలా రాశిసినిమా నుండి తప్పకుందట,  అలా రాశిసినిమా నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో సిమ్రాన్ ను చిత్ర బృందం హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: